Supreme Court: విచారణపై పోలీసులు ట్వీట్లు చేయొచ్చా?
కేసుల విచారణ వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్న వైనంపై విధివిధానాలు
దీనికి విధివిధానాలు రూపొందించాలి
సుప్రీంకోర్టులో వ్యాజ్యం
దిల్లీ: కేసుల విచారణ వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్న వైనంపై విధివిధానాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. క్రిమినల్ కేసుల విచారణ సమాచారాన్ని కొందరు పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుండడం ఇబ్బందికరంగా మారిందని, దీనిపై నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్దారు కోరారు. దీనిని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసు ఇచ్చింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే..అండమాన్-నికోబార్ దీవులకు చెందిన ఓ మహిళ జులై 30న ఆత్మహత్య చేసుకుంది. తొలుత తన బాధలను వివరిస్తూ వీడియో తీసింది. ఓ కేసు విచారణ సందర్భంగా తనపై ట్వీట్లు చేసిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇందుకు కారణమని అందులో ఆరోపించారు. ఇది మరణ వాంగ్మూలంలాంటిదే అయినప్పటికీ దీని ఆధారంగా చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ దిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ఈ వ్యాజ్యాన్ని వేశారు.
వ్యాజ్యం ప్రకారం ఆమె ఆత్మహత్యకుగల కారణాలను పరిశీలిస్తే...తప్పుడు ధ్రువపత్రాలతో అండమాన్-నికోబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉద్యోగం పొందారని ఆమెపై కేసు నమోదయింది. అయితే ఈ విషయంలో ఒక సీనియర్ పోలీసు అధికారి ఆమెపైనా, కుటుంబ సభ్యులపైనా ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో ఎలాంటి ట్వీట్లు చేయకూడదంటూ మే 12న ఆయనను ఆదేశించింది. అయితే జులై 30న ఆమె ఆత్మహత్య చేసుకుంది. వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వీడియో తీసింది. అది ఆగస్టు ఒకటో తేదీన సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయింది. దాంతో ఈ కేసుపై ఎలాంటి ప్రకటన చేసినా అది దర్యాప్తులో జోక్యం కిందకే వస్తుందంటూ పోలీసులు ట్వీట్ చేశారు. ఆమెకు ఓ ఎస్.ఐ.తో సంబంధం ఉందని, ఆయనకు మరో మహిళతో కూడా సంబంధం ఉండడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందంటూ కేసు నమోదయింది. ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ఎస్.ఐ.పై కేసు పెట్టారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారంటూ గుర్తుతెలియని వ్యక్తులపై మరో కేసు పెట్టారు. కానీ వీడియోలో ఆమె స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఐపీఎస్ అధికారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని దావాలో ఆరోపించారు. దర్యాప్తు సమయంలో ఆ మహిళపై ట్వీట్లు చేయడం ద్వారా పలు నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. ఆయనను సస్పెండ్చేసి, కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
శాశ్వత సైనికాధికారులుగా 39 మంది మహిళలను నియమించండి
సైన్యంలో శాశ్వత మహిళా అధికారుల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. 39 మంది షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారిణులను వారం రోజుల్లోగా పర్మినెంట్ కమిషన్ అధికారిణులుగా నియమించాలని ఆదేశించింది. ఈ పదవుల కోసం పరిగణనలోకి తీసుకోని మరో 25 మంది విషయమై కారణాలను వివరించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి సూచించింది. తొలుత 72 మంది షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారిణుల సేవలు కొనసాగింపు విషయమై సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక ఇచ్చింది. వీరిలో 39 మంది పర్మినెంట్ కమిషన్కు అర్హత పొందారని తెలిపింది. ఒకరు స్వచ్ఛందంగా వైదొలగగా, మరో ఏడుగురికి ఆరోగ్య సామర్థ్యం లేదని పేర్కొంది. క్రమశిక్షణ, నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతో ఇంకో 25 మందికి అవకాశం కల్పించలేమని వివరించింది.
ట్విటర్ అధికారికి నోటీసు
విచారణ నిమిత్తం పోలీసుల ముందుకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలంటూ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పీలుపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం ట్విటర్ అధికారిని ఆదేశించింది. వినియోగదారుడు ఒకరు మతపరంగా సున్నితమైన వీడియోను ట్విటర్లో పెట్టినందుకు పోలీసు స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి ఉత్తర్ప్రదేశ్ పోలీసులు నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా దాన్ని కొట్టివేసింది. అనంతరం హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ యూపీ పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం అమెరికాకు బదిలీ అయిన మనీష్ మహేశ్వరికి నోటీసు పంపిస్తున్నట్టు తెలిపింది.
కేడర్ కోరే అధికారం ఏఐఎస్లకు లేదు
ఫలానా రాష్ట్ర కేడర్ కావాలని కోరే హక్కు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసు (ఏఐఎస్) అధికారులకు లేదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. హిమాచల్ప్రదేశ్లో నియామకం పొందిన ఎ.షైనమోల్ అనే మహిళా ఐఏఎస్ అధికారిని స్వరాష్ట్రం కేరళకు బదిలీ చేయాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఈ వివరణ ఇచ్చింది.
సామూహిక వంటశాలల ఏర్పాటుపై విచారణ అంగీకారం తెలిపిన :సీజేఐ జస్టిస్ రమణ
ఆకలి, పౌష్టికాహారం లోపాలను నివారించడానికి సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలన్న అంశాన్ని అత్యవసర విచారణల జాబితాలో చేర్చడానికి శుక్రవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై ఓ విధానాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు నోటీసులు ఇవ్వాలంటూ వ్యాజ్యం దాఖలయింది. ‘‘దీనిపై నోటీసు ఇచ్చే ధర్మాసనానికి నేను ఆధ్వర్యం వహిస్తున్నాను’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ ధర్మాసనంలో ఆయనతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలు సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 27న విచారణ జరపనున్నట్టు తెలిపారు. పేదల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలంటూ ముగ్గురు సామాజిక కార్యకర్తలు గతంలో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాణ పత్రాలను సమర్పించాయో జాబితా రూపొందించాలని వారి తరఫు న్యాయవాది అసిమా మండ్లాను ధర్మాసనం ఆదేశించింది. ఆరు రాష్ట్రాలు ఇప్పటికీ ఎలాంటి ప్రమాణ పత్రాలు సమర్పించకపోవడంతో రూ.5 లక్షల వంతున జరిమానా విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి