China: సరిహద్దు ఒప్పందాలకు కొత్త చట్టం విఘాతం కాదు
కొత్తగా తాము తెచ్చిన సరిహద్దు చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాలతో
ఊహాగానాలు తగవంటూ చైనా వివరణ
బీజింగ్: కొత్తగా తాము తెచ్చిన సరిహద్దు చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాలతో ఇప్పటికే కుదిరిన సరిహద్దు ఒప్పందాల అమలుకు అది అవరోధం కాబోదని గురువారం తెలిపింది. దీనిపై ఆయా దేశాలు ‘ఉద్దేశపూర్వక ఊహాగానాలు’ చేయడం తగదని పేర్కొంది.
సరిహద్దుల రక్షణతో పాటు అక్కడి ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ నెల 23న చైనా పార్లమెంటు ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్పీసీ) ఒక చట్టాన్ని ఆమోదించింది. తూర్పు లద్దాఖ్లో దీర్ఘకాలంగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్ చేపట్టిన ఈ చర్యపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని సాకుగా చూపిస్తూ సరిహద్దుల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చే చర్యలను చైనా చేపట్టబోదని ఆశిస్తున్నట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక ఒప్పందాలపై దీని ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు. ‘‘ఇది సాధారణ, అంతర్గత చట్టం. అది మా వాస్తవిక అవసరాలను నెరవేరుస్తుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగానే అది ఉంది’’ అని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సహకారం అంశాన్ని కూడా ఆ చట్టంలో స్పష్టంగా పొందుపరిచామన్నారు. ప్రస్తుతమున్న సరిహద్దు ఒప్పందాల అమలుకు అది విఘాతం కాదంటూ.. పరోక్షంగా భారత్ లేవనెత్తిన ఆందోళనలను ప్రస్తావించారు. పొరుగు దేశాలతో సహకారం విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. కొత్త చట్టంపై అధ్యక్షుడు జిన్పింగ్ సంతకం చేశారని, అది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వాంగ్ చెప్పారు. ‘‘జాతీయ భూ సరిహద్దు చట్టాన్ని తీసుకురావడం వెనుక మాకున్న ఉద్దేశాల గురించి ఇప్పుడు వివరించా. దీనిపై సంబంధిత దేశాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడతాయని, ఈ చట్టంపై ఉద్దేశపూర్వక ఊహాగానాలకు స్వస్తి పలుకుతాయని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.
మాపై పెరిగిన అమెరికా నిఘా
అమెరికా తమపై నిఘాను బాగా పెంచిందని చైనా సైనిక పరిశోధన విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది అమెరికాకు చెందిన యుద్ధనౌకలు, విమానాలు 2వేలు సార్లు చాలా దగ్గరగా నిఘా వేసేందుకు వచ్చాయని చెప్పారు. ఇలాంటివి తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు. కాల్పుల ముప్పును కూడా పెంచుతాయని హెచ్చరించారు. చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పీఎల్ఏ)లో అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్స్లో పరిశోధకుడిగా ఉన్న కావో యాంజాంగ్ తాజాగా ఒక వార్షిక సైనిక సదస్సులో ఈ విషయాలు తెలిపారు. అమెరికా ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. అక్కడ తమ అధీనంలో ఉన్న దీవులపై కన్నేసి ఉంచుతోందని వివరించారు. ‘‘తరచూ ఇంత దగ్గరగా వచ్చి నిఘా పెట్టడం వల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇలాంటి చర్యలకు అనివార్యంగా చైనా నుంచి ప్రతిస్పందన తప్పదు. అవి కాల్పుల ముప్పును పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో తమను నిలువరించడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలకు అమెరికా తక్షణం స్వస్తి పలకాలని కోరారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దురుసు చర్యలు, హాంకాంగ్లో మానవహక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై పరస్పరం విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ