భేషుగ్గా బడులు తెరవొచ్చు.. విద్యార్థులు నిస్సంకోచంగా తరగతులకు వెళ్లవచ్చు
దేశంలో పాఠశాలల పునఃప్రారంభానికి ఎలాంటి సంకోచం అవసరంలేదని, విద్యార్థులు నిర్భయంగా తరగతి గదులకు హాజరు
వారిలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ: ఐసీఎంఆర్ శాస్త్రవేత్త సమీరన్ పాండా
దేశంలో పాఠశాలల పునఃప్రారంభానికి ఎలాంటి సంకోచం అవసరంలేదని, విద్యార్థులు నిర్భయంగా తరగతి గదులకు హాజరు కావచ్చని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు బడులను తెరవాలని ఆయన కోరారు. ఇతర దేశాల్లో వైరస్ వ్యాప్తి మనల్ని కలవరానికి గురిచేస్తుందన్నారు. ఐసీఎంఆర్లోని అంటు వ్యాధుల విభాగాధిపతి కూడా అయిన డాక్టర్ సమీరన్ పాండా ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. విద్యార్థులు కరోనా వైరస్ వాహకులు కాదని స్పష్టం చేశారు. ‘తొలి విడత కొవిడ్ విజృంభణ సమయంలో పాఠశాలల మూసివేత హేతబద్ధమైన చర్యే. రెండో దశ వ్యాప్తి అప్పుడు పాఠశాలలు మూసివేసే ఉన్నాయి. అయినప్పటికీ చిన్నారులకు వైరస్ సోకింది. దీనిని బట్టి పాఠశాలల పునఃప్రారంభానికి, విద్యార్థులకు కరోనా రావడానికి సంబంధమే లేదని స్పష్టమవుతోంది’ అని అన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తుండడంతో దేశంలోని అనేక జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలను తెరవడానికి అధికారులు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో డాక్టర్ సమీరన్ సూచన పరిశీలనార్హమైనదే. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగు జాగ్రత్తలతో పాఠశాలలను నడుపుతున్నాయి.
‘నాల్గవ జాతీయ సెరో సర్వే ప్రకారం పాఠశాలలు మూసివేసి ఉన్నప్పటికీ చాలా మంది పిల్లలకు కరోనా సోకింది. అనేక మందిలో వైరస్ ప్రతిరక్షకాలు కనిపించాయి. విద్యార్థులను బడికి పంపిస్తే వారికి కరోనా సోకుతుందనే భయం అనవసరం. దేశంలో విద్యా సంస్థల ప్రారంభానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి’ అని డాక్టర్ సమీరన్ పాండా స్పష్టం చేశారు. మన దేశంలో తయారైన రెండు టీకాలూ సురక్షితమైనవేనన్నారు. దేశంలో కొత్త వైరస్ వేరియంట్లు ఏమీ లేవని తెలిపారు. ‘దేశంలో ఇప్పటికే చాలా మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికులకు వ్యాధినిరోధకత కూడా సమకూరింది. ఈ పరిస్థితుల్లో మరోసారి వైరస్ అంతగా ప్రభావం చూపకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. టీకాల కార్యక్రమంలో వెనుకబడిన రాష్ట్రాలకు మాత్రం ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుత పండగల సీజన్లో కరోనా కేసుల సంఖ్య కొంత వరకు పెరగవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ