Gold: శానిటరీ ప్యాడ్స్‌లో 2.4 కేజీల బంగారం  

ఎయిర్‌ ఇండియా విమానంలో పని చేస్తున్న ఓ మహిళ.. 

Published : 11 Nov 2021 12:48 IST

ఎయిర్‌ ఇండియా విమానంలో పని చేస్తున్న ఓ మహిళ.. శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు యత్నించారు. చివరకు కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోయారు. ఆమె నుంచి  2.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ కోజికోడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ విమానం షార్జా నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన మహిళను మలప్పురం ప్రాంతానికి చెందిన షహానాగా గుర్తించారు. షహానా.. తన శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని అక్రమ రవాణా చేసిందని.. వాటిని తన లోదుస్తుల్లో దాచిందని అధికారులు చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని