Crime News: ప్రేమికుడితో వెళ్లిందని బాలికకు శిరోముండనం

గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న

Published : 14 Nov 2021 14:11 IST

గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న కారణంతో 14 ఏళ్ల బాలికను గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘బాలిక చర్యల వల్ల తమ తెగకు చెడ్డ పేరు వచ్చిందని.. ఆమెను ‘శుద్ధి’ చేసేందుకే ఈ శిక్ష విధించాం’’ అని ‘వాడి’ తెగకు చెందిన గిరిజనులు పేర్కొన్నారు. అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించారు. నవంబరు 10న హారిజ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో 35మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. బాలిక ప్రేమించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అపహరించి అత్యాచారం చేశాడని అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని