128 చదరపు అడుగుల ఫ్లాటు.. ధర రూ.6 కోట్ల పైమాటే
400 చదరపు అడుగుల ఇల్లంటే... ఇంత ఇరుకా అనుకుంటాం. అలాంటిది కేవలం 128 చదరపు అడుగుల్లోనే నివసించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?
మైక్రో, నానోఫ్లాట్లలోనే సగం మంది జీవనం
ఆకాశహర్మ్యాల నగరం హాంకాంగ్లో జీవన వైచిత్రి
హాంకాంగ్: 400 చదరపు అడుగుల ఇల్లంటే... ఇంత ఇరుకా అనుకుంటాం. అలాంటిది కేవలం 128 చదరపు అడుగుల్లోనే నివసించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకాశహర్మ్యాల నగరం హాంకాంగ్లో ఎక్కడచూసినా ఇలాంటి బుల్లి ఫ్లాట్లే! అలాగని వీటి ధరలేమీ తక్కువ కాదు. ఈ బుల్లి ఇంటిని సొంతం చేసుకోవాలంటే... కనీసం రూ.6 కోట్లు పెట్టాల్సిందే.
220 చదరపు అడుగుల ఇల్లు అనగానే... ‘వావ్! ఇంత విశాలమైన ఇల్లా’ అని హాట్ కేకుల్లా కొనేసుకుంటారు హాంకాంగ్లో. ఎందుకంటే ఇక్కడ 128 చదరపు అడుగుల (14.22 చదరపు గజాల) ఫ్లాట్లు కోకొల్లలు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో హాంకాంగ్ ఒకటి. దీని విస్తీర్ణం 1,106 చదరపు కిలోమీటర్లు. ఇందులో కేవలం 7% భూభాగమే నివాస ప్రాంతం. మిగతా భూభాగాన్ని కొండలకు, ప్రకృతి ఆవాసాలకు, పార్కులకు విడిచిపెట్టారు. ఇక ఇక్కడి ప్రస్తుత జనాభా సుమారు 75 లక్షలు. ఒక్క చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 49 వేల మంది నివసిస్తున్నారు. తక్కువ స్థలంలో నివసించే జీవనశైలికి 1960ల్లోనే ఇక్కడ బీజం పడింది. జనాభా పెరుగుతుండటంతో, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను ముందే ఊహించిన అప్పటి హాంకాంగ్ గవర్నర్ లార్డ్ మాక్లెహోస్...
75% భూభాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నివాసేతర ప్రాంతంగానే ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ ఆకాశహర్మ్యాలు వెలిశాయి. కారు నిలపడానికి అవసరమైన దానికంటే తక్కువ స్థలంలో సొంత ఫ్లాట్ దొరికితే చాలు... మహద్భాగ్యమే ఇక్కడ!
సూక్ష్మ గృహోద్యమంతో...
‘నీకు సొంతిల్లు లేదంటే... అది నీ సమస్యే’ అన్న భావన హాంకాంగ్లో అత్యంత బలంగా ఉంది. దీంతో కనీసం ఒక్క ఫ్లాట్ అయినా కొనుక్కోవాలన్న లక్ష్యం అందరిలోనూ కనిపిస్తుంది. ఈ డిమాండుకు తగ్గట్టు సూక్ష్మ గృహోద్యమం పుట్టుకొచ్చి... 128, 168, 220 తదితర చదరపు అడుగుల నానోఫ్లాట్లతో కూడిన టవర్ల నిర్మాణం ఊపందుకొంది. కరోనాకు ముందు 2019లో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్నప్పుడు... ఇలాంటి సుమారు 8,500 ఫ్లాట్లు చటుక్కున అమ్ముడుపోయాయి.
లోపల ఏమేం ఉంటాయి?
సగటు ఇంటి విస్తీర్ణంతో పోలిస్తే, దానికి సగం స్థలంలో నిర్మించిన ఇళ్లను మైక్రోఫ్లాట్స్ అంటారు. ఇవి సుమారు 290 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉండేవాటిని నానోఫ్లాట్స్ అంటారు. ఆధునిక వసతులతో వీటిని అత్యంత సౌకర్యవంతంగా నిర్మిస్తారు. అక్కడికక్కడే ఒక మంచం, అర, మరుగుదొడ్డి, కిచెన్ ఉంటాయి. బాత్రూంలో కుండీపైనే స్నానం చేయడానికి అవసరమైన షవర్ను అమర్చేస్తారు. కిచెన్లో ఇన్బిల్ట్గా మైక్రోవోవెన్ ఉంటుంది.
కనిపించని అసంతృప్తి...
మైక్రో, నానో ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా హాంకాంగ్ సర్కారు కూడా గృహనిర్మాణ నిబంధనలను ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తోంది. జనాభాలో దాదాపు సగం మందికి సొంత మైక్రో, నానోఫ్లాట్లు ఉన్నాయి. అద్దెకు ఇచ్చేందుకు మాత్రం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తుంటారు. ఇలాంటి వాటిలో వేల మంది జీవనం సాగిస్తున్నారు. మిగతా దేశాలవారితో పోల్చితే తాము అత్యంత చిన్న గదుల్లో జీవిస్తున్నామన్న అసంతృప్తి ఇక్కడివారిలో అంతగా కనిపించడంలేదు. పైగా, కుటుంబం పెద్దదయ్యేకొద్దీ పెద్ద ఇళ్లలోకి వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు!
కోట్లు గుమ్మరించాల్సిందే
హాంకాంగ్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. 128 నుంచి 288 చదరపు అడుగుల ఫ్లాట్ల ఖరీదు... సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకూ ఉంటున్నాయి.
- 2010 నుంచి ఇక్కడ సొంతిళ్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో 2019 నాటికి ఫ్లాట్ల ధరలు ఏకంగా 187% మేర ఎగబాకాయి.
- గంటకు రూ.360 (4.82 డాలర్లు) కనీస సంపాదన ఉండే నగరంలో సగటు ఇంటి ఖరీదు రూ.9.66 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు).
- ఆ లెక్కన అత్యంత నిపుణుడైన ఉద్యోగి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిని సొంతం చేసుకోవడానికి... కనీసం 21 సంవత్సరాలు పనిచేయాల్సిందేనని ఓ అధ్యయనం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..