Air Pollution: వాయు కాలుష్యంతో ఊపిరి విలవిల
రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. ఒక్క 2019లోనే మన
2019లో మన దేశంలో 9.07 లక్షల మంది మృతి
బొగ్గు ఉద్గారాల వల్ల మరణాలు 1.57 లక్షలు
లాన్సెట్ గ్లోబల్ కౌంట్డౌన్ నివేదిక వెల్లడి
ఈనాడు, దిల్లీ: రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. ఒక్క 2019లోనే మన దేశంలో 9,07,000 మంది దీని కారణంగానే మృతి చెందినట్లు సోమవారం విడుదలైన గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ రిపోర్ట్-2021 పేర్కొంది. ‘వాతావరణ మార్పు-ప్రపంచ ఆరోగ్య భద్రతకు ముప్పు’ పేరుతో లాన్సెట్, ఐసీఎంఆర్, ఎన్ఐఐఆర్ఎన్సీడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్కమ్యూనికబుల్ డిసీజెస్) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. 2015తో పోలిస్తే దేశంలో కాలుష్యకారక మరణాలు 2019 నాటికి 8% పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ‘‘బొగ్గు ఉద్గారాల వల్లే దాదాపు 1.57 లక్షల మంది చనిపోయారు. ఇందులో థర్మల్ విద్యుత్తు ప్లాంట్లతో పాటు పరిశ్రమలు, ఇళ్లలో వినియోగించే బొగ్గు ద్వారా వెలువడే కాలుష్యం కూడా ఉంది. సూక్ష్మధూళి రేణువులు వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. పీఎం 2.5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే రేణువులు ఊపిరితిత్తులను దాటుకొని రక్తంలోకి ప్రవేశిస్తున్నాయి. నిర్మాణ పనులు, కూల్చివేతలు, మైనింగ్ కార్యకలాపాలు, వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్తు కేంద్రాల్లో శిలాజ ఇంధనం మండించడం, డీజిల్, పెట్రోల్ వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. దీర్ఘకాలం ఈ కాలుష్యంలో ఉంటే పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. పెద్దల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ (సీఓపీడీ)ముప్పు పెరిగి గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్లతో మరణం సంభవించే ప్రమాదం ఉంది. పుట్టబోయే పిల్లలపైనా ప్రభావం పడుతుంది’’ అని నివేదిక వెల్లడించింది.
నివేదిక సూచించిన నివారణ చర్యలివి
- థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళిరేణువుల నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. దీని కోసం వెచ్చించే వ్యయాన్ని ఆర్థిక, సామాజిక, వైద్య కోణంలో చూడాలి.
- సాధ్యమైనంత త్వరగా విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు వినియోగాన్ని తగ్గించి సౌర, పవన, హైడ్రో ఇంధనంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి.
- పారిశ్రామిక, నిర్మాణ, వాహన కాలుష్యాన్ని మూలాల్లోనే తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
- వ్యవసాయ రంగం నుంచి వచ్చే గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 46% మేకలు, గొర్రెలు, ఇతర పశువుల నుంచే ఉంటున్నాయి. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా వాటి నుంచి వెలువడే మిథేన్ను తగ్గించవచ్చు. మంచి మేత విధానాలు, వాటి ఎరువును సరైన విధానంలో నిర్వహించడం, అనుత్పాదక పశువులను తగ్గించడం వల్ల మిథేన్ ఉద్గారాలను కట్టడి చేయవచ్చు.
- దేశంలో వైద్య సౌకర్యాలు, పరీక్షలు, నిఘా వ్యవస్థలను మెరుగుపరచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య