Modi Govt: మోదీ సర్కారు పట్టువిడుపులు
దేశ రాజధానిలో ఏడాది కాలంగా రైతులు పట్టువిడవకుండా జరిపిన పోరాటానికి తలొగ్గి మోదీ సర్కారు మూడు
దేశ రాజధానిలో ఏడాది కాలంగా రైతులు పట్టువిడవకుండా జరిపిన పోరాటానికి తలొగ్గి మోదీ సర్కారు మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసింది. అయితే మోదీ ప్రభుత్వం చట్టాలకు సంబంధించి తన నిర్ణయాలను ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో గతంలోనూ కొన్ని చట్టాలు, బిల్లులపై వెనక్కి తగ్గింది. వాటిలో మచ్చుకు కొన్ని..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
ఈ చట్టాన్ని సవరించి 200 వెనుకబడిన జిల్లాలకే పరిమితం చేయాలని 2014లో మోదీ సర్కారు నిర్ణయించింది. పనివారు, సామగ్రి నిష్పత్తినీ తగ్గించింది. దీనివల్ల చట్టం పరమార్థం దెబ్బతింటుందని 29 మంది ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభ్యంతరపెట్టారు. అవినీతిని తగ్గించి, స్త్రీలు, దళితులు, ఆదివాసీలకు మేలు చేసి, ఉత్పాదక ఆస్తులను సృష్టించిన ఈ చట్టాన్ని నీరుగార్చరాదని ఒత్తిడి తెచ్చారు. సర్కారు సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే విరమించింది.
ఎల్.ఏ.ఆర్.ఆర్(లార్) చట్టం
భూసేకరణ, పునరావాస (లార్) చట్టం సవరణ బిల్లును 2015లో ప్రవేశపెట్టింది. దీన్ని అన్నా హజారే, రైతులు, పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలే కాకుండా శివసేన, అకాలీ దళ్ వంటి మిత్ర పక్షాలూ వ్యతిరేకించాయి. బిహార్ ఎన్నికలకు ముందు సంబంధిత ఆర్డినెన్స్కు కాలం తీరిపోయినట్లు సర్కారు ప్రకటించింది.
పశువుల విక్రయంపై నిషేధం
పశువుల చోరీనీ, పశు అక్రమ వ్యాపారాన్నీ అరికట్టే పేరుతో 2017లో జంతువులపై క్రూరత్వ నిషేధ చట్టం కింద కొత్త నిబంధనలను తెచ్చింది. పశువులను కబేళాలకు తరలించకుండా ఇవి నిషేధిస్తాయి. ఈ నిబంధనలు రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్, కేరళ, మేఘాలయ నిరసించాయి. కేరళ, కర్ణాటకల్లో గొడ్డు మాంసం వేడుకలు నిర్వహించారు. కొత్త నిబంధనలపై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు దేశమంతటికీ విస్తరించింది. రాష్ట్రాలతో చర్చించిన మీదట కేంద్రం నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018 ఏప్రిల్లో కొత్త నిబంధనలు రూపొందించింది.
ఎఫ్ఆర్డీఐ బిల్లు
బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఫైనాన్స్ సంస్థల్లో దివాలా కేసుల పరిష్కారానికి 2017 ఆగస్టులో కేంద్రం లోక్సభలో ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెట్టింది. దివాలా కేసులు పరిష్కారం కాకపోతే డిపాజిట్ దారులు కొంత భారాన్ని భరించాలన్నది బిల్లు ఉద్దేశం.దీన్ని ప్రతిపక్షాలతోపాటు బ్యాంకు ఉద్యోగుల సంఘం, అసోచామ్ వ్యతిరేకించాయి. బిల్లును సమగ్రంగా సమీక్షించాల్సి ఉందంటూ కేంద్రం దాన్ని ఉపసంహరించింది.
సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్ హబ్
ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో సమాచారంపై నిఘాకు సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్ హబ్ ఏర్పాటుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2018 ఏప్రిల్లో అనుమతి కోరింది. దీనివల్ల పౌరుల ఆన్లైన్ సంభాషణలను ఆలకించి, ఈ-మెయిల్స్నూ చూసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. హబ్ టెండరును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర సమాచార శాఖకు ఇంటర్నెట్ ఫ్రీడం అసోసియేషన్ లీగల్ నోటీసు పంపింది. ఈ హబ్ను సృష్టించడం నిఘా రాజ్యానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హబ్ యోచనను కేంద్రం పక్కన పెట్టింది. (సహకారం: రామోజీ విజ్ఞాన కేంద్రం)
ఈపీఎఫ్ చట్టం, పీఎఫ్ విత్డ్రాయల్ నిబంధనల సవరణ
రెండు నెలలకు మించి నిరుద్యోగులుగా ఉన్న భవిష్యనిధి (పీఎఫ్) సభ్యులు తమ ఖాతాలోని డబ్బునంతటినీ విత్డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం 2016 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా నిరసించాయి. సవరణ వల్ల తమ పీఎఫ్ ఖాతాలో యజమాని వాటా కోరే హక్కును పదవీ విరమణ వయసు (58 ఏళ్లు) పూర్తయ్యేవరకు ఉపయోగించుకునే వీలుండదని వారి ఆందోళన. ఒత్తిడికి తలొగ్గి కేంద్రం సంబంధిత నోటిఫికేషన్ను రద్దు చేసింది.
కొవిడ్ టీకాల సేకరణ విధానం
ఈ ఏడాది ఏప్రిల్లో ఒక వైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు దేశమంతటా వ్యాక్సిన్ కేంద్రాల్లో తీవ్ర డోసుల కొరత ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు లోనైంది. 18-44 ఏళ్లవారికి టీకా వేయడానికి 25 శాతం డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనాలని మే 1 నుంచి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కేంద్రమే టీకాలను కొని వ్యాక్సిన్ కేంద్రాలకు సరఫరా చేయాలని ప్రతిపక్షాలు తెచ్చిన ఒత్తిడి, ఆ మేరకు సుప్రీంకోర్టు జోక్యం సర్కారును ఇరుకున పెట్టాయి. మోదీ సర్కారు దిగివచ్చి, కేంద్రమే 75 శాతం డోసులను కొని రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్