ఆస్ట్రియాలో నాలుగో ఉద్ధృతి దేశవ్యాప్తంగా లాక్డౌన్
ప్రపంచంలో.. ప్రధానంగా ఐరోపాలోని పలు దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆస్ట్రియా, జర్మనీ, నార్వే
ఐరోపా దేశాల్లో కొవిడ్ విజృంభణ
బెర్లిన్: ప్రపంచంలో.. ప్రధానంగా ఐరోపాలోని పలు దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆస్ట్రియా, జర్మనీ, నార్వే తదితర దేశాల్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఆస్ట్రియాలో కరోనా నాలుగో ఉద్ధృతి (ఫోర్త్ వేవ్) తీవ్రంగా ఉండటంతో దేశవ్యాప్త లాక్డౌన్కు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే సోమవారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్బర్గ్ శుక్రవారం ప్రకటించారు. మరిన్ని ఉద్ధృతులకు చోటివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. 10 రోజుల లాక్డౌన్ తర్వాత కూడా కేసులు తగ్గకపోతే దీన్ని 20 రోజులకు పొడిగిస్తామన్నారు. తాజా పరిణామాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోవడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఆస్ట్రియా వైద్యులు స్వాగతించారు. 90 లక్షల జనాభా ఉన్న ఆస్ట్రియాలో గత వారం రోజులుగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధ, గురు వారాల్లో దాదాపు 15 వేల చొప్పున కేసులు బయటపడ్డాయి. ఈ దేశంలో 65.7% మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.
జర్మనీలో ‘అత్యవసర పరిస్థితి’..
ఆస్టియ్రా పొరుగు దేశమైన జర్మనీలోనూ కొవిడ్ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. రోజుకు 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. జర్మనీలో పరిస్థితి ‘అత్యవసర’ స్థాయికి చేరుకుందని ఆ దేశ వ్యాధుల నియంత్రణ సంస్థ అధిపతి లోతర్ వీలెర్ పేర్కొన్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయని, ఇకపై సాధారణ వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. మహమ్మారిని అదుపు చేసేందుకు అత్యవసర చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
కొవిడ్ కట్టడికి పార్లమెంటు కొత్త నిబంధనల అమలుకు ఆమోదించింది. దీంతో ఇకపై బహిరంగ ప్రదేశాల్లో తిరగాలన్నా, ప్రజారవాణాను వినియోగించుకోవాలన్నా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపించాలి. టీకా తీసుకోని పక్షంలో కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. జర్మనీలో వరుసగా ముడో రోజు కూడా 1,200 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
* నార్వేలోనూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారు. విదేశాల నుంచి ఎవరైనా నార్వేలోకి రావాలంటే 3 రోజులు ముందుగా అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు అనుమతి లభించినవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అలాగే కరచాలనాలు చేయవద్దని ప్రభుత్వం సూచించింది.
శ్రీలంకలో డెల్టా కొత్త ఉప రకం
కొలంబో: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న కొవిడ్ డెల్టా వేరియంట్ (బీ.1.617.2)కు సంబంధించిన కొత్త ఉపరకాన్ని శ్రీలంకలో కనుగొన్నారు. శాస్త్రీయంగా ‘బీ.1.617.2.ఏవై 104’గా పిలిచే ఈ రకం శ్రీలంకలో కరోనా వైరస్ మూడో ఉత్పరివర్తనగా చెబుతున్నారు. శ్రీజయవర్ధనేపుర విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్న ఈ ఉప రకానికి సంబంధించిన శాంపిళ్లను తదుపరి విశ్లేషణ కోసం హాంకాంగ్లోని ల్యాబ్లకు పంపించారు. ‘‘తొలుత కరోనా వైరస్ (సార్స్-కోవ్-2) వేరియంట్ బీ.411 బయటపడింది. తర్వాత బీ.1.617.2.ఏవై28ని కనుగొన్నాం. తాజా రకం మూడోది’’ అని విశ్వవిద్యాలయం మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ చండిమా జీవదర తెలిపారు. శ్రీలంకలోని ఉత్తర, ఉత్తర-మధ్య, దక్షిణ ప్రావిన్సుల్లో ఈ రకం బయటపడినట్లు చెప్పారు. వైరస్ వేర్వేరు విధాలుగా.. ఒక్కోచోట ఒక్కోలా ఉత్పరివర్తనలకు లోనవుతున్నట్లు తెలుస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు