Covishield: కొవిషీల్డ్ను బూస్టర్ డోసుగా గుర్తించాలి: డీసీజీఐకి ‘సీరం’ వినతి
కొవిషీల్డ్ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్
దిల్లీ: కొవిషీల్డ్ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోరింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. దీని మాతృక టీకా అయిన ఆస్ట్రాజెనెకాకు బ్రిటన్ ప్రభుత్వం బూస్టర్ డోసుగా గుర్తించిందని సీఐఐలో ప్రభుత్వం తరఫున డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ప్రకాశ్ కుమార్ సింగ్ చెప్పారు. కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వస్తున్నందున బూస్టర్ డోసులు ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయని తెలిపారు. చాలా దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసులను ఇస్తున్నాయి. దేశంలో కొవిషీల్డ్ టీకాకు కొరత లేదని, రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నందున తమ వినతిని పరిశీలించాలని ఆ సంస్థ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా