Covishield: కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా గుర్తించాలి: డీసీజీఐకి ‘సీరం’ వినతి 

కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ 

Published : 02 Dec 2021 12:11 IST

దిల్లీ: కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. దీని మాతృక టీకా అయిన ఆస్ట్రాజెనెకాకు బ్రిటన్‌ ప్రభుత్వం బూస్టర్‌ డోసుగా గుర్తించిందని సీఐఐలో ప్రభుత్వం తరఫున డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వస్తున్నందున బూస్టర్‌ డోసులు ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయని తెలిపారు. చాలా దేశాల్లో ఇప్పటికే బూస్టర్‌ డోసులను ఇస్తున్నాయి. దేశంలో కొవిషీల్డ్‌ టీకాకు కొరత లేదని, రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నందున తమ వినతిని పరిశీలించాలని ఆ సంస్థ కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని