ఒమిక్రాన్ విజృంభణ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్... తాజాగా మరిన్ని దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి బయటపడ్డ ఈ వేరియంట్ ఇప్పటివరకూ 36 దేశాలకు వ్యాపించింది.
అగ్రరాజ్యంలో మరింతగా వ్యాప్తి
న్యూయార్క్లో కొత్తగా 5 కేసులు
న్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్... తాజాగా మరిన్ని దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి బయటపడ్డ ఈ వేరియంట్ ఇప్పటివరకూ 36 దేశాలకు వ్యాపించింది. అమెరికాలో మొత్తం ఐదు రాష్ట్రాలు దీని బారిన పడ్డాయి. న్యూయార్క్లో శుక్రవారం ఒక్కరోజే అయిదు కేసులు నమోదయ్యాయి! దీంతో అగ్రరాజ్యంలో ఈ తరహా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
అనేక ఉత్పరివర్తనాలు సంతరించుకున్న కారణంగా ఒమిక్రాన్ చాలా వేగంగా, సమర్థంగా వ్యాపిస్తున్నట్టు న్యూయార్క్ నగర మేయర్ బిల్ దే బ్లాసియో పేర్కొన్నారు. ఈ వేరియంట్ సోకిన బాధితుల్లో కొందరు అసలు ఇళ్లలోంచి బయటకే రాలేదని... దీన్ని బట్టి అమెరికాలో ఇంతకుముందే ఈ వేరియంట్ వ్యాపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్... డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికైతే స్వల్ప లక్షణాలే...
సింగపుర్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొత్త వేరియంట్ సోకినట్టు తాజాగా నిర్ధారణ అయింది. వారిని ప్రత్యేకంగా ఉంచి, చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరిలోనూ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు వైద్య అధికారులు తెలిపారు. మలేసియాలో శుక్రవారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 19 ఏళ్ల విదేశీ యువతికి ఈ వేరియంట్ సోకినట్టు వైద్యశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ తెలిపారు. ఆమెతో పాటు ఉన్న నలుగురిని క్వారంటైన్కు తరలించారు. దక్షిణ కొరియాలో కొత్త వేరియంట్ కేసులు ఆరుకు చేరాయి. బాధితులంతా ఇటీవల నైజీరియా నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు.
దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్వో బృందం :మహమ్మారి వ్యాప్తి కట్టడి కోసమే..
జొహానెస్బర్గ్: కరోనా కొత్త వేరియంట్- ఒమిక్రాన్ దెబ్బకు వణికిపోతున్న దక్షిణాఫ్రికాకు సాయం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరో అడుగు ముందుకేసింది. ఆ దేశంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న గౌటెంగ్ ప్రావిన్సుకు తాజాగా నిపుణుల బృందాన్ని పంపించింది. వైరస్ వ్యాప్తిపై నిఘా ఉంచి, బాధితులను త్వరితగతిన గుర్తించడం ద్వారా మహమ్మారిని కట్టడి చేయడంలో వారు స్థానిక ప్రభుత్వానికి చేయూతనందించనున్నట్లు డబ్ల్యూహెచ్వో ఆఫ్రికా రీజనల్ ఎమెర్జెన్సీ డైరెక్టర్ డాక్టర్ సలామ్ గ్వెయె తెలిపారు. కొవిడ్ కేసుల జన్యు విశ్లేషణ కోసం తమ బృందం ఒకటి ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్న సంగతిని గుర్తుచేశారు. దక్షిణాఫ్రికాలో గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 80%.. ఒక్క గౌటెంగ్ ప్రావిన్సులోనివే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు