రూ.5 వేలకే కారవాన్‌.. 

పర్యాటకులను ఆకర్షించేందుకు.. కేరళ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చింది.

Published : 05 Dec 2021 12:19 IST

ఇక కేరళను చుట్టేయండి

పర్యాటకులను ఆకర్షించేందుకు.. కేరళ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ‘ట్రక్‌ క్యాంపర్‌’ ప్రాజెక్టుతో పర్యాటకులు.. విలాసవంతమైన సదుపాయాలు ఉన్న కారావాన్‌లో ప్రయాణించి కేరళను చుట్టేయవచ్చు. దీనిని ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్‌ రియాజ్, రవాణా మంత్రి ఆంటోని రాజు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటకకు చెందిన లక్స్‌ క్యాంపర్‌ సంస్థతో కేరళ సర్కారు జతకట్టింది. రోజుకు రూ. 5వేలు అద్దె ఉండే ఈ కారవాన్‌లో ఇద్దరు పడుకునేందుకు వీలుగా బెడ్‌రూం, ఏసీ, కిచెన్, బాత్‌రూం ఉంటాయి. లక్స్‌ క్యాంపర్‌ సైట్‌ ద్వారా దీనిని బుక్‌ చేసుకోవచ్చు. 2022 ఫిబ్రవరి నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని