Covid: ఐరోపాలో 5-14 ఏళ్ల పిల్లల్లో అధికంగా కొవిడ్
ఐరోపా ప్రాంతంలో ఇటీవల కొవిడ్ బారిన పడుతున్నవారిలో 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువ శాతం ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
జెనీవా: ఐరోపా ప్రాంతంలో ఇటీవల కొవిడ్ బారిన పడుతున్నవారిలో 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువ శాతం ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) యూరప్ కార్యాలయం తెలిపింది. గత 2 నెలల్లో ఈ ప్రాంతంలో కరోనా కేసులు, మరణాలు రెట్టింపు అయినట్లు డబ్ల్యూహెచ్ఓ ఐరోపా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లుజ్ తెలిపారు. ఇప్పటికీ విస్తృత వ్యాప్తిలో ఉన్న డెల్టా రకంతోనే ముప్పు తలెత్తుతోందన్నారు. పిల్లలను, పాఠశాలలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆయా దేశాలను కోరారు. కొన్నిచోట్ల మిగిలినవారి కంటే పిల్లలో 2-3 రెట్లు కూడా ఎక్కువగా కొవిడ్ వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పారు. పిల్లల్లో వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే బడులకు పంపిస్తే వారి నుంచి ఇళ్లలో ఉండే తల్లిదండ్రులు, వయోధికులకు 10 రెట్లు ముప్పు ఉంటున్నట్లు చెప్పారు. ఇలాంటివారిలో ఎవరైనా టీకా తీసుకోకుంటే వ్యాధి తీవ్రస్థాయికి చేరడం, ప్రాణాపాయం వంటి ముప్పు పెరుగుతున్నట్లు తెలిపారు. ఈమేరకు కొవిడ్ వ్యాక్సినేషన్ తక్షణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐరోపా, మధ్య ఆసియాల్లో డెల్టా వేరియంట్ ఇప్పటికీ ప్రబలంగా ఉన్నట్లు వెల్లడించారు. గత వారం డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని కేసుల్లో 70% ఐరోపాలోనే నమోదయ్యాయి.
432 ఒమిక్రాన్ కేసులు..
ఐరోపా ప్రాంతంలోని 21 దేశాల్లో 432 ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు డాక్టర్ హాన్స్ క్లుజ్ తెలిపారు. ఈ కొత్త వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందుతుందా? దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందా? తక్కువగా ఉం టుందా? వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్