Britain: చైనా దూకుడుకు కళ్లెం వేస్తాం.. ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తాం
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా బలప్రదర్శన, ఆ దేశం అనుసరిస్తున్న దూకుడు వైఖరిపై జి-7 దేశాల సమావేశంలో వాడిగావేడిగా చర్చ జరుగుతోంది.
ఉక్రెయిన్ పట్ల రష్యాది దుష్టవైఖరి
జి-7 దేశాల సదస్సులో బ్రిటన్ ఉద్ఘాటన
లివర్ పూల్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా బలప్రదర్శన, ఆ దేశం అనుసరిస్తున్న దూకుడు వైఖరిపై జి-7 దేశాల సమావేశంలో వాడిగావేడిగా చర్చ జరుగుతోంది. డ్రాగన్ను నిలువరిస్తామని, ఇందుకు ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తామని బ్రిటన్ విస్పష్టం చేసింది. లివర్ పూల్లో శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశాన్ని ‘అంతర్జాతీయ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఐక్యత ప్రదర్శన’గా బ్రిటన్ విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ అభివర్ణించారు. ఓవైపు చైనా, ఇరాన్లతో ఉద్రిక్తతలు పెరుగుతుంటే, మరోవైపు ఉక్రెయిన్ పట్ల రష్యా దుష్ట వైఖరిని అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు. కూటమి సభ్య దేశాలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
రష్యాపై ఆధారపడొద్దు
ఉక్రెయన్ సరిహద్దుల్లో రష్యా సైనిక, ఆయుధ మోహరింపులు పెరుగుతున్న నేపథ్యంలో- స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాలు రష్యన్ సహజవాయువు, నిధులపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తద్వారా తమ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని బ్రిటన్ పిలుపునిచ్చింది. రష్యా నుంచి జర్మనీకి సహజ వాయువును రవాణా చేయడానికి ఉద్దేశించిన నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైపులైను ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని ట్రస్ ఈ వ్యాఖ్యలు చేశారు. సహజ వాయువు కోసం ప్రజాస్వామ్య దేశాలు రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, నార్డ్ స్ట్రీమ్-2 పైపులైన్ను వ్యతిరేకిస్తున్న జర్మన్ గ్రీన్పార్టీ నాయకురాలు ఎనలీనా బేయర్ బాక్... విదేశాంగ మంత్రి హోదాలో సమావేశానికి హాజరయ్యారు. మెర్కెల్ నిష్కమ్రణ అనంతరం జర్మనీలో గ్రీన్ పార్టీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. రష్యన్ సహజవాయువు బ్రిటన్కు అవసరంలేదు కాబట్టే ఆ దేశం నార్డ్స్ట్రీమ్ను గట్టిగా వ్యతిరేకిస్తోందన్న ఆరోపణలున్నాయి. అయితే, లండన్ ఆర్థిక, స్థిరాస్తి మార్కెట్లలో రష్యన్ నిధులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చే అక్రమ ధనానికి లండన్ అడ్డాగా మారిందన్న విమర్శలు మాత్రం తప్పట్లేదు. రష్యా గనుక ఉక్రెయిన్పై దాడిచేస్తే తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా, నాటో దేశాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఉక్రెయిన్పై దాడిచేసే ఉద్దేశం తమకు లేదనీ, ఉక్రెయినే తమపై దురాక్రమణకు పాల్పడాలని చూస్తోందని రష్యా ఆరోపిస్తోంది.
తైవాన్పైకి మళ్లీ డ్రాగన్ యుద్ధవిమానాలు
తైవాన్పై చైనా దుందుడుకు వైఖరి కొనసాగిస్తోంది. ఆ దేశంపై ఒత్తిడి పెంచే కవ్వింపు చర్యల్లో భాగంగా గగనతలంలోకి మరోసారి యుద్ధ విమానాలను పంపింది. మొత్తం 13 చైనా సైనిక విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి శుక్రవారం ప్రవేశించినట్లు తైవాన్ రక్షణశాఖ ధ్రువీకరించింది. ఆఫ్రికా దేశమైన నికరాగువా తైవాన్తో దౌత్య సంబంధాలు తెంచుకున్నరోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మరోవైపు.. ఇదే రోజున అటు చైనాతో నికరాగువా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. తైవాన్ గగనతలంలోకి ప్రవేశించిన విమానాల్లో రెండు హెచ్-6 బాంబర్లు, ఓ వై-8 ఎలక్టాన్రిక్ వార్ఫేర్ విమానం ఉన్నట్లు తెలుస్తోంది. వై-8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ విమానంతోపాటు ఆరు షెన్యాంగ్ జే-16, రెండు చెంగ్డూ జే-10 ఫైటర్ జెట్ విమానాలు కూడా ఉన్నాయని తైవాన్ రక్షణశాఖ వెల్లడించింది. చైనాకు దీటుగా తాము సైతం వాయుసేన యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపినట్లు తైవాన్ తెలిపింది. చైనా విమానాలను హెచ్చరించేలా రేడియో సంకేతాలు పంపడంతోపాటు ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను రంగంలోకి దించినట్లు వివరించింది. తైవాన్ను ఆక్రమించుకోవాలన్న లక్ష్యంతో చైనా ఇలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా తైవాన్పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కి పైగా యుద్ధ విమానాలను ఆ దేశం మీదకు పంపింది. తైవాన్ను పూర్తిగా తమలో విలీనం చేసుకుంటామని, అవసరమైతే సైనికచర్యకు వెనుకాడబోయేది లేదని చెబుతోంది. 1949 సివిల్వార్ సమయంలో తైవాన్, చైనా విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించేందుకు డ్రాగన్ విముఖత చూపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?