Supreme Court: నిర్మాణ కార్మికులకు పరిహారం ఇస్తాం
రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం భవన నిర్మాణ పనులు నిలిపివేసినందున ఉపాధి కోల్పోయిన కూలీలకు
సుప్రీంకు తెలిపిన రాజస్థాన్, యూపీ
దిల్లీ: రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం భవన నిర్మాణ పనులు నిలిపివేసినందున ఉపాధి కోల్పోయిన కూలీలకు పరిహారం చెల్లిస్తామని రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు తెలిపాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు నవంబరు 24న ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు ప్రమాణ పత్రాలను సమర్పించాయి. రాజస్థాన్లోని ఆల్వార్, భరత్పుర్ జిల్లాలు దేశ రాజధాని ప్రాంతం పరిధిలోకి వస్తాయి. నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు రూ.252 వంతున, అర్ధనైపుణ్యం ఉన్నవారికి రూ.264, నైపుణ్యంగల వారికి రూ.276 వంతున చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. 267 మందికి ఇవ్వనున్నట్టు వివరించింది. ఉత్తర్ప్రదేశ్లో వారానికి రూ.1000 వంతున ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఓబీసీ వివరాలు ఇవ్వడం కుదరదు
సామాజిక-ఆర్థిక, కుల గణాంకాలు-2021ని ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించలేమని బుధవారం సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులోని ఓబీసీల వివరాలను విశ్లేషించలేదని, అందువల్ల వాటిని అందజేయడం సాధ్యం కాదని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. వీటిలో తప్పులు ఉన్నందున వివిధ అవసరాల కోసం వినియోగించడం సాధ్యం కాదని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తాము ఆదేశాలు ఇస్తే అది మరింత గందరగోళానికి దారి తీస్తుందని అభిప్రాయపడింది.
నగదు అక్రమ చలామణి కేసులోరాఘవ్ బహల్పై చర్యలు వద్దు
నగదు అక్రమ చలామణి కేసులో మీడియా రంగ ప్రముఖుడు రాఘవ్ బహల్కు బుధవారం సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తొలుత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీకి నోటీసు ఇచ్చిన హైకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించడానికి మాత్రం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. నగదును అక్రమంగా తరలించి లండన్లో గుర్తు తెలియని ఆస్తిని కొనుగోలు చేశారంటూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన పన్నులన్నీ చెల్లించారని, అందువల్ల నగదును అక్రమంగా తరలించే ప్రశ్న తలెత్తదని బహల్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనతో పాటు భార్య, కుమారుడు, కుమార్తెకు కూడా ఈడీ నోటీసులు పంపించిందని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బహల్పై చర్యలు తీసుకోకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది.
రాజ్ కుంద్రాకు అరెస్టు నుంచి రక్షణ
అశ్లీల చిత్రాల వీడియోలను పంపిణీ చేస్తున్నారన్న కేసులో వ్యాపారవేత్త రాజ్కుంద్రాను అరెస్టు చేయకుండా బుధవారం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని, అంతవరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోకూడదని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నటుల అనుమతితోనే వాటిని చిత్రీకరించారని, వాటి రూపకల్పన, ప్రసారం చేయడంలో కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. యాప్ల ద్వారా అశ్లీల చిత్రాలను పంపిణీ చేస్తున్నారన్న మరో కేసులో గతంలో ముంబయి పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, సెప్టెంబరు నెలలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు