Mobile: ఆన్‌లైన్‌ క్లాసు మధ్యలో పేలిన ఫోన్‌

ఆన్‌లైను క్లాసు జరుగుతుండగా ఓ విద్యార్థి చేతిలోని ఫోను పేలింది. 15 ఏళ్ల ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 18 Dec 2021 10:42 IST

ఆన్‌లైను క్లాసు జరుగుతుండగా ఓ విద్యార్థి చేతిలోని ఫోను పేలింది. 15 ఏళ్ల ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చంద్‌ కుయియా గ్రామానికి చెందిన రాం ప్రకాశ్‌ భదౌరియా 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఫోనులో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా  చేతిలోని ఫోను పేలడంతో అతని దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని