Omicron: 89 దేశాల్లో ఒమిక్రాన్ అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.
దిల్లీ/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఈ వేరియంట్ సామాజిక వ్యాప్తి దశకు చేరిన ప్రాంతాల్లో 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నట్లు వెల్లడించింది. ఆగ్నేయాసియా ప్రాంత పరిధిలోని 7 దేశాల్లో ఒమిక్రాన్ బయటపడిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ శనివారం అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ కట్టడికి గాను ప్రజారోగ్య, సామాజిక చర్యలను మరింత ముమ్మరం చేయడం అత్యవసరమని స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముప్పు అధికంగా ఉన్నవారిని కాపాడే విషయమై కీలకంగా దృష్టి సారించాలని సూచించారు. దక్షిణాఫ్రికా నుంచి అందుతున్న డేటా ప్రకారం ఒమిక్రాన్తో రీ-ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతున్నట్లు తెలుస్తోందని, అయితే ఈ వేరియంట్పై ఇప్పటికీ డేటా పరిమితంగానే ఉందని పేర్కొన్నారు. రానున్న వారాల్లో మరింత సమాచారం అందే అవకాశం ఉందని ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్తో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. కేసుల సంఖ్య పెరిగి వైద్య వ్యవస్థలు మరోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగినంతగా ఐసీయూ పడకలు, ఆక్సిజన్ లభ్యత, వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని.. అన్నిస్థాయిల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తుండాలని సూచించారు. మహమ్మారితో పోరులో టీకా అతి ముఖ్యమైన అస్త్రమని.. అయితే వ్యాక్సినేషన్తో పాటు అన్ని ప్రజారోగ్య చర్యలు చేపట్టడమూ కీలకమేనని తెలిపారు. ‘‘మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ.. ఇతరులనూ కాపాడాలి. ఇందుకు గాను తప్పక టీకా తీసుకోవాలి. మాస్కు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టీకాలు తీసుకున్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ పాటించాలి’’ అని ఆమె సూచించారు.
24 గంటల్లో 7,145 కేసులు
మన దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య శనివారం కొంతమేర తగ్గింది. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు) 7,145 కొత్త కేసులు బయటపడగా.. 289 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కి చేరగా.. ఇంతవరకు 4,77,158 మందిని మహమ్మారి బలిగొంది. 3,41,71,471 మంది కొవిడ్ను జయించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 84,565 (0.24%)కి తగ్గింది. దేశవ్యాప్తంగా శుక్రవారం 12,45,402 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.57 శాతం నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.