Parliament: ప్రధాన ఇంధన వనరు బొగ్గే
పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ దేశ ప్రధాన ఇంధన వనరుగా బొగ్గే కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు
ఈనాడు, దిల్లీ: పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ దేశ ప్రధాన ఇంధన వనరుగా బొగ్గే కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇంధన భద్రతకు, థర్మల్ విద్యుదుత్పత్తికి తగినంత బొగ్గు నిల్వలు మనకు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా అందుబాటు ధరల్లోనూ లభిస్తుందని పేర్కొన్నారు. బొగ్గు వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తామంటూ కాప్26 సదస్సులో భారత ప్రభుత్వం హామీ ఇవ్వడంపై సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించలేదన్నారు.
రెండో విడత అనుబంధ పద్దులకు లోక్సభ ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా మరో రూ.3.73లక్షల కోట్ల వ్యయ అనుమతులకు సంబంధించి రెండో విడత అనుబంధ పద్దును సోమవారం లోక్సభ ఆమోదించింది. ఈ మొత్తంలో ఎయిర్ ఇండియాకు అందజేసే నిధులు రూ.62వేల కోట్లు, ఎరువులపై అదనపు రాయితీ రూ.58,430 కోట్లు, పెండింగ్లో ఉన్న ఎగుమతుల ప్రోత్సాహకాల చెల్లింపులకు రూ.53,123కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ నిధి కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు అందజేసే రూ.22,039 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన తొలి విడత అనుబంధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం రూ.23,675 కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు పార్లమెంటు ఆమోదాన్ని పొందింది.
కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 122 మంది విద్యార్థుల ఆత్మహత్య
కేంద్ర విద్యా సంస్థల్లో 2014-2021 మధ్య కాలంలో 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇందులో సెంట్రల్ యూనివర్శిటీల్లో 27 మంది, ఐఐటీల్లో 34, ఎన్ఐటీల్లో 30, ఐఐఎస్ఈఆర్లో 9, ట్రిపుల్ఐటీల్లో నలుగురు, ఇతర కేంద్ర సంస్థల్లో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడించారు. సోమవారం లోక్సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 41 మంది ఓబీసీ, 24 మంది ఎస్సీ, ముగ్గురు ఎస్టీ, ముగ్గురు మైనార్టీ విద్యార్థులున్నట్లు తెలిపారు. కేంద్ర విద్యా సంస్థల్లో విద్యార్థులు వేధింపులు, వివక్షకు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం, యూజీసీ పలు చర్యలు తీసుకొందని చెప్పారు.
పాఠశాలల్లో భగవద్గీత బోధనను రాష్ట్రాలు అనుమతించుకోవచ్చు
పాఠాశాలల్లో భగవద్గీత బోధనకు సంబంధించిన అనుమతులను రాష్ట్రాలు మంజూరు చేసుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి లోక్సభకు తెలిపారు. అది ఆయా రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అలాగే భోజ్పురి భాష బోధనపై కూడా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. సీబీఎస్ఈ పాఠశాలల్లోని వివిధ తరగతుల్లో భగవద్గీత బోధన జరుగుతోందన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
మాదక ద్రవ్యాల నియంత్రణ (ఎన్డీపీఎస్) చట్టంలోని కొన్ని స్వల్ప పొరపాట్లను సరిచేయడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఎన్డీపీఎస్ సవరణ బిల్లు తొలుత ఈ నెల 13న లోక్సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును సోమవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో సమ్మతించింది.
సభ నడవాలని విపక్షం కోరుకోవట్లేదు: భాజపా
అంతరాయాలు కలిగించి అడ్డుకోవడమే విపక్షాల మంత్రంగా ఉందని, సభలు నడవాలని అవి కోరుకోవట్లేదని భాజపా విమర్శించింది. 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్పై నెలకొన్న ప్రతిష్టంభన మీద చర్చించడానికి ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సమావేశానికి ఐదు పార్టీలు హాజరుకాకపోవడాన్ని తప్పుపట్టింది. రాజ్య సభాపక్ష నేత పీయూష్ గోయల్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- అవాంతరాలు తప్పిస్తే విపక్షాలకు మరేమీ అవసరం లేదన్నారు. ఉభయ పక్షాలూ సమావేశమై ఒక పరిష్కారానికి రావాలని భావిస్తున్న రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఇచ్చిన ఆదేశాలతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2010లో ఏడుగురు విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేస్తే ఆ తర్వాత ఆనాటి విపక్ష నేతగా అరుణ్జైట్లీ క్షమాపణలు కోరిన మీదటే ఆ చర్యను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. సస్పెండైనవారిలో భాజపా ఎంపీలెవరూ లేకపోయినా విపక్ష నేతగా జైట్లీ అలా స్పందించారని చెప్పారు. పార్లమెంటుతో పాటు సభాధ్యక్షుని గౌరవాన్ని కాపాడడానికి ఇప్పుడు 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పాలని గోయల్ అన్నారు. గత ఆరు దశాబ్దాలుగా ఇలాంటిది ఆనవాయితీగా వస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు రెండు బిల్లులు
చట్టాల తయారీ ప్రక్రియలో తగిన విధంగా సంప్రదింపులు జరపలేదన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో రెండు బిల్లులను పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. జీవ వైవిధ్య(సవరణ) బిల్లును సంయుక్త కమిటీకి, మధ్యవర్తిత్వ బిల్లును స్థాయీ సంఘం(లా అండ్ జస్టిస్)కి సిఫార్సు చేసింది. జీవ వైవిధ్య(సవరణ)బిల్లును సంయుక్త కమిటీ పరిశీలనకు పంపించాలన్న తీర్మానాన్ని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. సంయుక్త కమిటీలో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ(శాస్త్రసాంకేతికత, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు) పరిశీలనకు కాకుండా సంయుక్త కమిటీకి పంపించడంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేశ్ అభ్యంతరం తెలుపుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వివాదాస్పదమైన జీవ వైవిధ్య (సవరణ) బిల్లును సంయుక్త కమిటీకి పంపించడంలో ప్రభుత్వ ఉద్దేశాలు ఏమిటో స్పష్టమవుతున్నాయని ఆక్షేపించారు. స్టాండింగ్ కమిటీ(శాస్త్రసాంకేతికత, పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పులు)కి జైరామ్ రమేశ్ ఛైర్మన్గా ఉన్నారు.
* మధ్యవర్తిత్వ బిల్లు-2021ను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు ప్రతిపాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్