Maharashtra: శునకం మరణంపై 9 ఏళ్లకు పరిహారం

శునకం మరణం విషయంలో సుమారు 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయస్థానంలో విజయం సాధించాడు ఓ వ్యక్తి.

Published : 23 Dec 2021 10:40 IST

మహారాష్ట్ర: శునకం మరణం విషయంలో సుమారు 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయస్థానంలో విజయం సాధించాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని చంద్రాపుర్‌కు చెందిన ఉమేశ్‌ భత్కార్‌కు జాన్‌ అనే శునకం ఉండేది. ఓ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో అది పనిచేసేది. ఫలితంగా మహేశ్‌కు నెలకు రూ.8 వేల ఆదాయం లభించేది. జనవరి 10, 2013న ఉదయం స్థానిక పాఠశాలకు చెందిన బస్సు శునకాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జాన్‌ అక్కడికక్కడే మరణించింది. దీంతో పాఠశాల యాజమాన్యం, ట్రావెల్స్‌ కంపెనీపై ఉమేశ్‌ కేసు పెట్టారు. అనంతరం చంద్రాపుర్‌లోని వాహన ప్రమాదాల పరిహార ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. శునకాన్ని చంపిన కారణంగా తన జీవన భృతికి ఇబ్బంది కలిగిందని పిటిషన్‌ దాఖలు చేశారు. బజాజ్‌ అలయంజ్, ట్రావెల్స్‌ కంపెనీ యజమాని, డ్రైవర్‌ను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చివరకు ఉమేశ్‌ భత్కర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సుమారు 9 ఏళ్ల తరువాత ఉమేశ్‌కు న్యాయం జరిగినట్లైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని