Crime News: దారుణం..డ్రగ్స్‌ ఇచ్చివిద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాదకద్రవ్యాలు ఇచ్చిన ఇద్దరు

Updated : 26 Dec 2021 10:48 IST

ముజఫర్‌నగర్‌: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాదకద్రవ్యాలు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలిక గురువారం ప్రైవేటు క్లాసుకు వెళ్లగా.. అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు మాదకద్రవ్యాలు ఇచ్చారు. అనంతరం బాధితురాలిని సాద్‌పుర్‌ గ్రామం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారని బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటికే అక్కడ వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరికి తోడయ్యారని,  ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టి.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. మత్తు నుంచి తేరుకున్నాక తనపై జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని