Crime News: దారుణం..డ్రగ్స్ ఇచ్చివిద్యార్థినిపై గ్యాంగ్ రేప్
పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాదకద్రవ్యాలు ఇచ్చిన ఇద్దరు
ముజఫర్నగర్: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాదకద్రవ్యాలు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక గురువారం ప్రైవేటు క్లాసుకు వెళ్లగా.. అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు మాదకద్రవ్యాలు ఇచ్చారు. అనంతరం బాధితురాలిని సాద్పుర్ గ్రామం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారని బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటికే అక్కడ వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరికి తోడయ్యారని, ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టి.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. మత్తు నుంచి తేరుకున్నాక తనపై జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని