Omicron: ప్రపంచం.. కరోనాతో కలవరం!
వాషింగ్టన్, లండన్, బెర్లిన్: కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.
అమెరికాలో 95% ఒమిక్రాన్ కేసులే
ఫ్రాన్స్లో ఒక్కరోజే 2.71 లక్షల మందికి వైరస్
వాషింగ్టన్, లండన్, బెర్లిన్: కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.67 లక్షల మందికి వైరస్ సోకింది. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్ష మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొత్త కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటాయని భావిస్తున్నట్లు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) పేర్కొంది. గత రెండు వారాలుగా అమెరికాలో రోజుకు సగటున 4.80 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానయాన సంస్థలు సిబ్బంది కొరతతో సతమతం అవుతున్నాయి. గత వారంలో రోజుకు సగటున 14,800 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 63 శాతం అధికం.
- ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఫ్రాన్స్లో మంగళవారం ఒక్కరోజే 2,72,686 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఇటలీలో మంగళవారం 1,70,844 కేసులు నమోదయ్యాయి. 222 మంది ప్రాణాలు కోల్పోయారు. 30వేల మంది వైరస్ను జయించారు.
- స్పెయిన్లో ఒమిక్రాన్ విజృంభణతో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,17,775 మందికి వైరస్ సోకింది. 116 మంది మరణించారు. 13వేల మంది వైరస్ను జయించారు.
కొత్త వేరియంట్ను అధిగమించగలం: బోరిస్
బ్రిటన్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 2,18,274 మందికి వైరస్ సోకింది. 48 మంది మరణించగా 50వేల మంది వైరస్ను జయించారు. ఇంగ్లండ్లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన మంత్రిమండలికి సిఫార్సు చేశారు. లాక్డౌన్కు బదులు ప్రణాళిక ‘బి’ అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడం, వీలున్న చోటల్లా సిబ్బంది ఇంటి నుంచి పని చేయడం, భారీస్థాయి కార్యక్రమాలకు హాజరయ్యేవారి టీకా ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయడం వంటివి ఉన్నాయి. ‘‘లాక్డౌన్లు లేకుండానే ఒమిక్రాన్ దశను అధిగమించేందుకు మనకో అవకాశం ఉంది. పాఠశాలలను, వ్యాపారాలను తెరిచే ఉంచగలం. ఈ వైరస్తో సహజీవనం చేసే మార్గాన్ని మనం గుర్తించగలం’’ అని బోరిస్ చెప్పారు.
ఇజ్రాయెల్లో సరికొత్త రికార్డు
ఇజ్రాయెల్లో బుధవారం రికార్డు స్థాయిలో 11,978 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది డెల్టా వేరియంట్ ఉద్ధృతి సమయంలో సెప్టెంబరు రెండో తేదీన నమోదైన 11,345 కేసులే ఇప్పటివరకు రికార్డు కాగా, ఇప్పుడు అది తుడిచిపెట్టుకుపోయింది.
భారత విమానాలపై హాంకాంగ్ నిషేధం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో హాంకాంగ్ కొవిడ్-19 ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. భారత్ సహా ఎనిమిది దేశాల నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. జనవరి 21 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హాంకాంగ్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో