మేకలతో వెళ్తూ లారీ బోల్తా..పోటీపడి వాటిని ఎత్తుకుపోయిన గ్రామస్థులు

హైదరాబాద్‌కు మేకలను తీసుకెళ్తున్న లారీ బోల్తాపడగా...

Updated : 06 Jan 2022 11:31 IST

విదిషా: హైదరాబాద్‌కు మేకలను తీసుకెళ్తున్న లారీ బోల్తాపడగా... సమీపంలోని గ్రామస్థులు వాటిని పట్టుకుపోయేందుకు పోటీపడ్డారు. లారీ కింద చిక్కుకుపోయిన వ్యక్తిని మాత్రం ఎవరూ కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సిరోంజ్‌ జిల్లా, కంకర్‌ఖేడి లోయ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. శివపురి నుంచి సుమారు వంద మేకలతో బయల్దేరిన లారీ... రాత్రి 8 గంటల సమయంలో కంకర్‌ఖేడి వద్ద అదుపుతప్పి, లోయలో పడిపోయింది. ఇది గమనించిన సమీపంలోని గ్రామస్థులు... ఘటనా స్థలానికి పరుగుపరుగున చేరుకున్నారు. అక్కడున్న మేకలను పట్టుకుపోయేందుకు పోటీపడ్డారు. పోలీసులు వారించినా వినలేదు. అయితే, ట్రక్కు కింద చిక్కుకుపోయిన సచిన్‌ కాటిక్‌ అనే వ్యక్తిని మాత్రం ఎవరూ సకాలంలో కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని