CBSE: సీబీఎస్ఈ కొత్త నిబంధన కొట్టివేత
విద్యార్థులు చివరిగా రాసిన పరీక్షలో సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామంటూ గత ఏడాది జూన్లో
12వ తరగతి మార్కులపై సుప్రీంకోర్టు తీర్పు
ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశం
దిల్లీ: విద్యార్థులు చివరిగా రాసిన పరీక్షలో సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామంటూ గత ఏడాది జూన్లో సీబీఎస్ఈ తీసుకొచ్చిన నిబంధనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 12వ తరగతి విద్యార్థుల తుది మార్కులను ఖరారు చేయడానికి సంబంధించి జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రెండు పరీక్షలకు సంబంధించిన మార్కుల్లో ఏదో ఒక దానినే ఖరారు చేయాల్సి వస్తే... తనకు ఉత్తమమైన స్కోరును ఎంచుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు తొలుత సకాలంలో పరీక్ష నిర్వహించలేకపోయింది. ఆ సమయంలో 30:30:40 పద్ధతిలో మార్కులు కేటాయిస్తామని తెలిపింది. అది ఇష్టంలేని వారు పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది. అయితే, చివరిగా రాసిన పరీక్షలో వచ్చిన మార్కులనే ఖరారు చేస్తామంటూ సీబీఎస్ఈ తన విధానంలో మార్పు తీసుకొచ్చింది. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ కొత్త నిబంధనను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తీప్పునిచ్చింది.
30:30:40 ఫార్ములా అంటే...
12వ తరగతి చదివే విద్యార్థికి 30శాతం మార్కులను అతను/ఆమె పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా, 30శాతం మార్కులను 11వ తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా, 40 శాతం మార్కులను..12వ తరగతిలోని యూనిట్, మిడ్టర్మ్ తదితర పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా కేటాయించడం. ఈ ఫార్ములాలో మార్కులు కేటాయించిన తర్వాత గత ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశాన్ని కల్పించింది. చివరిగా రాసిన ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే ఖరారు చేస్తామనడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం తెలిపారు.
ఉమ్మడి ఉద్దేశం ఉన్నంతమాత్రాన సెక్షన్ 34 వర్తించదు
దిల్లీ: ఒక నేరంలో స్వతహాగా ఉమ్మడి ఉద్దేశం ఉన్నంత మాత్రాన ‘తోడ్పాటు చర్యలు లేకుండా’ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్-34 వర్తించకపోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎక్కువమంది కలిసి ఒక నేరానికి పాల్పడినప్పుడు వారందరి ఉద్దేశం ఒక్కటే అయినా ఆ నేరాన్ని ఒక్కరే చేసిన రీతిలో ప్రతి ఒక్కరూ బాధ్యులేనని ఈ సెక్షన్ చెబుతోంది. నేరం చేయాలన్న ఉమ్మడి ఉద్దేశంలో ఒక వ్యక్తి క్రియాశీల పాత్ర పోషించినా, తర్వాత దాని నుంచి వైదొలగే అవకాశం ఉంటుందని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ల ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఈ సెక్షన్ కింద చర్యలు చేపట్టేటప్పుడు కోర్టులు దీనిని విశ్లేషించి సాక్ష్యాలను మదించాలని వ్యాఖ్యానించింది. నలుగురు ముద్దాయిలకు 2019లో పంజాబ్-హరియాణా హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ వీరిలో ఇద్దరు దాఖలు చేసిన అప్పీళ్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. న్యాయస్థానం సంతృప్తి చెందేలా తగిన రీతిలో, పక్కాగా, కచ్చితంగా, విస్పష్టంగా సాక్ష్యాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైనే ఉందని పేర్కొంది. ఇద్దరు నిందితులపై హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్