Supreme Court:అగ్నిప్రమాదాలను దైవచర్యగా భావించలేం
ప్రకృతిలో సహజంగా సంభవించే తుపాన్లు, వరదలు, భూకంపాలు, పిడుగులు వంటి వాటి కారణంగా జరిగే
ఆకస్మిక విపత్తుల వల్ల సంభవిస్తేనే.. పరిగణనలోకి తీసుకుంటాం
‘యాక్ట్ ఆఫ్ గాడ్’పై సుప్రీంకోర్టు తీర్పు
దిల్లీ: ప్రకృతిలో సహజంగా సంభవించే తుపాన్లు, వరదలు, భూకంపాలు, పిడుగులు వంటి వాటి కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలనే న్యాయ పరిభాషలో దైవిక చర్య(యాక్ట్ ఆఫ్ గాడ్)గా భావించగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఒకవేళ అగ్గిరాజుకున్నా దానిని ఆర్పే సాధనాలు అందుబాటులో ఉంటే నష్టాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చు. ఇవేవీ పాటించని పరిస్థితుల్లో జరిగే అగ్ని ప్రమాదాలన్నిటినీ దైవిక చర్యలుగా పరిగణనలోకి తీసుకోబోమని జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరీ, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. విద్రోహం, ఉద్దేశపూరిత చర్యల వల్ల ప్రమాదం జరిగితే అది వేరే విషయమని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దైవిక చర్యగా పేర్కొనడంతో పాటు ఆ సంస్థకు ఎక్సైజ్ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సమర్థనీయంగా లేదని స్పష్టం చేసింది. పన్నుల కింద రూ.6.39 కోట్లు చెల్లించాల్సిందిగా ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ మెక్డొనాల్డ్స్ కంపెనీని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మద్యం తయారీ కంపెనీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా...దైవిక చర్యలో తీవ్ర నష్టం కలిగినందున పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునివ్వాలంటూ తీర్పు వెలువడింది. యూపీ ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2003 ఏప్రిల్ 10వ తేదీ రాత్రి జరిగిన అగ్ని ప్రమాద పరిస్థితులు, తద్వారా ఆస్తినష్టం తదితరాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే...మానవ ప్రయత్నం ద్వారా ముందుగానే అటువంటి ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుందనే అభిప్రాయం కలుగుతుందనిసర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.
కోర్టు ఉద్యోగుల అవినీతిని సమర్థించం
న్యాయస్థానాల్లో అవినీతి సమర్థనీయం కాదని, ముడుపులు డిమాండ్ చేయరాదన్న నిబంధన జడ్జీలతో పాటు ఉద్యోగులందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్లోని జిల్లా కోర్టులో పనిచేసిన ఉద్యోగి ఒకరు రూ.50వేల లంచం తీసుకున్న నేరం నిర్ధరణ కావడంతో సర్వీసు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. 24 ఏళ్ల పాటు సేవలందించిన తనకు దిగువ కోర్టులు విధించిన శిక్ష మరింత కఠినంగా ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టుల తీర్పును సమర్థించింది. సర్వీసును పునరుద్ధరించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. తప్పుచేసినట్లు పిటిషనరే ఒప్పుకున్నందున అతనికి ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. ముడుపులు స్వీకరించడం, నిందితులను అందుకోసం డిమాండ్ చేయడం వంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఈ నిబంధనలు జడ్జీలకు మాత్రమే కాదు న్యాయస్థానంలో పనిచేసే వారందరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది. పిటిషనర్కు విధించిన శిక్షను ‘ఉద్వాసన’(డిస్మిసల్)కు బదులు... ‘తొలగింపు’(రిమూవల్)గా మార్చుతున్నట్లు తెలిపింది. దీనివల్ల అతను మరేదైనా ఉద్యోగం పొందడానికి వీలుకలుగుతుందని ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!