
Kapil Sibal : కాంగ్రెస్కు భారీ షాక్..! పార్టీ వీడిన కపిల్ సిబల్
దిల్లీ : వరుస పరాజయాలతో కుదేలవుతోన్న కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతోన్న వేళ.. ఆ పార్టీకి తాజాగా భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ను వీడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాజ్వాజ్ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
ఇదిలాఉంటే, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులపై పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ రెబల్గా మారిన జీ-23 బృందంలోనూ కపిల్ సిబల్ ఉన్నారు. పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన.. అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీనే తీసుకుంటారని పలుసార్లు విమర్శించారు. ఇలా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్ సిబల్ చివరకు పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
స్వతంత్ర గళం కోసమే..
‘పార్లమెంట్లో స్వతంత్ర గళం ఉండడం ఎంతో ముఖ్యం. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే ఎటువంటి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మన గళాన్ని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశాను’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. అయితే, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కపిల్ సిబల్కు సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే కపిల్ సిబల్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ‘కపిల్ సిబల్తోపాటు మరో ఇద్దరు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. సీనియర్ లాయర్ అయిన కపిల్ సిబల్ పార్లమెంట్లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలరు. ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ అభిప్రాయాలను కూడా పార్లమెంటులో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.
అందుకేనా..?
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కపిల్ సిబల్ పదవీ కాలం జులైతో ముగుస్తుంది. అయితే, 2016లో ఉత్తర్ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన సిబల్కు అప్పుడు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే మిగిలాయి. దీంతో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. ఇదే సమయంలో కపిల్ సిబల్కు సమాజ్వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ తరపున సుప్రీం కోర్టులో సిబల్ వాదనలు వినిపించారు. రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. దీంతో అజాంఖాన్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఇందుకు కపిల్ సిబల్ కృషి చేసినందునే ఆయనకు సమాజ్వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
MLAs Dance: మహా సీఎంగా శిందే.. ఎగిరి గంతులేసిన రెబల్ ఎమ్మెల్యేలు
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్రెడ్డి
-
Technology News
iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
-
India News
Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
-
India News
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తేదీలు ఖరారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)