బామ్మ ఈత.. బంగారు విజేత
జాతీయ ఈత పోటీల్లో 82 ఏళ్ల వృద్ధురాలు బంగారు పతకం సాధించారు. వందల మంది పోటీదారులతో హోరాహోరీగా తలపడి మొదటి స్థానంలో నిలిచారు.
జాతీయ ఈత పోటీల్లో 82 ఏళ్ల వృద్ధురాలు బంగారు పతకం సాధించారు. వందల మంది పోటీదారులతో హోరాహోరీగా తలపడి మొదటి స్థానంలో నిలిచారు. హరియాణాలోని అంబాలా జిల్లాలో శనివారం జరిగిన జాతీయ ఈత పోటీల్లో బామ్మ ఈ ఘనత సాధించారు. జిల్లాలోని హీరోస్ మెమోరియల్ వద్ద మూడు రోజుల పాటు జాతీయ ఈత పోటీలు అట్టహాసంగా సాగాయి. దేశ వ్యాప్తంగా 750 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు. బిహార్కు చెందిన లాల్ పారి రాయ్ అనే 82 ఏళ్ల వృద్ధురాలు మహిళల సీనియర్ సిటిజన్ విభాగం(100 మీటర్ల పోటీ)లో బంగారు పతకం కైవసం చేసుకున్నారు. కాగా.. బామ్మకు 30 ఏళ్లకు పైగా ఈతలో ప్రావీణ్యం ఉంది. నీటిలో మునిగిపోతున్న ఎంతో మందిని కాపాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!