Corona: కొవిడ్.. ఓ పీడకల!
ప్రపంచానికి కొవిడ్-19 మిగిల్చిన చేదుజ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల మానవుల్లో చోటుచేసుకున్న దీర్ఘకాల ప్రభావాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు.
ప్రపంచానికి కొవిడ్-19 మిగిల్చిన చేదుజ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల మానవుల్లో చోటుచేసుకున్న దీర్ఘకాల ప్రభావాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. నిద్రకు విఘాతం కలిగిస్తోందని, పీడకలలకూ కారణమవుతోందని తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి.
నిద్ర.. మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా కీలకం. మంచి నిద్ర వల్ల రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠమై, ఇన్ఫెక్షన్లపై గట్టిగా పోరాటం చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వల్ల శయనంపై పడుతున్న ప్రభావం గురించి నిపుణులు నిశితంగా శోధించడం మొదలుపెట్టారు. మహమ్మారి విజృంభణ మొదలైన తొలినాళ్లలో.. లాక్డౌన్ల వల్ల విశ్రమించే పోకడలపై పడే సానుకూల, ప్రతికూల ప్రభావాలను పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువసేపు నిద్రించారని, కానీ ఆ విశ్రాంతిలో నాణ్యత కొరవడిందని తేల్చారు.
కొత్త వివరాలు
ఇప్పుడు రెండో విడత డేటా లభ్యమవుతోంది. కొవిడ్ బారినపడటం వల్ల మన నిద్రపై ఎలాంటి ప్రభావం పడుతోంది? చివరికి అది మన కలల్లోకి ఎలా చొరబడుతోందన్నది వెలుగులోకి వచ్చింది. అందులోని అంశాల ప్రకారం..
* కొవిడ్ బారినపడినవారిలో 52 శాతం మంది.. ఇన్ఫెక్షన్ సమయంలో నిద్రలో అవరోధాలు ఎదుర్కొన్నారు.
* ఎక్కువ మందిలో కనిపించిన లోపం.. నిద్రలేమి (ఇన్సోమ్నియా). ఈ సమస్య ఉన్నవారు గాఢనిద్రలోకి వెళ్లలేకపోవడం లేదా ఆ స్థితిలో ఎక్కువసేపు కొనసాగలేకపోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో వారు తెల్లవారకముందే మేల్కొంటున్నారు.
* ఆందోళనకరమైన అంశమేమిటంటే.. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాక కూడా వారిలో నిద్ర సమస్యలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత కూడా 26 శాతం మందిలో ఇన్సోమ్నియా ఉంటోంది.
* కొవిడ్ పాజిటివ్గా తేలిన ఒక నెల తర్వాత కూడా బాధితులకు నిద్ర విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువే.
నిద్రలో ఇబ్బందులు.. లాంగ్ కొవిడ్
కరోనా లక్షణాలు దీర్ఘకాలం కొనసాగే ‘లాంగ్ కొవిడ్’ బాధితుల్లో నిద్ర సమస్యలూ ఎక్కువ కాలం కొనసాగుతాయని స్పష్టమవుతోంది. 2021లో 3వేల మంది లాంగ్ కొవిడ్ బాధితులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తమకు నిద్ర సమస్యలు ఉన్నట్లు 80 శాతం మంది చెప్పారు. వీరిలో ఎక్కువగా ఉన్న ఇబ్బంది ఇన్సోమ్నియా.
* ఇది ఆందోళనకరం. గాఢ నిద్ర మనలో అలసటను తగ్గించి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. కొవిడ్ బాధితుల్లో కనిపిస్తున్న ‘బ్రెయిన్ ఫాగ్’కు కొంతమేర ఈ తరహా విశ్రాంతి లోపించడమే కారణం.
నిద్రపై కొవిడ్ ప్రభావం ఇలా
* మెదడుపై కొవిడ్ ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. అందులో నిద్ర-మెలకువ దశలను నియంత్రించే ప్రాంతాలూ ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్ కారక వైరస్.. కేంద్ర నాడీ వ్యవస్థలో ఇన్ఫెక్షన్ కలిగించడం లేదా మెదడులోని రక్తనాళ వ్యవస్థను ప్రభావితం చేయడం ఇందుకు కారణం కావొచ్చు.
* కొవిడ్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. వీటివల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలగొచ్చు.
* కరోనా బారినపడటం వల్ల కుంగుబాటు, ఆదుర్దా వంటి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. ఏకాకిగా ఉండాల్సి రావడం, ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం వంటివి ఆందోళన కలిగించొచ్చు. ఫలితంగా రెప్పవాలకపోవచ్చు.
కలలపైనా
కొవిడ్తో కలలపై పడే ప్రభావాన్ని ‘ఇంటర్నేషనల్ కొవిడ్ స్లీప్ స్టడీ’ పేరిట 14 దేశాల శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇందులో కొవిడ్ నుంచి కోలుకున్నవారిని, ఆ వైరస్ బారినపడని వారిని సర్వే చేశారు. ఈ రెండు బృందాలకూ.. గతంతో పోలిస్తే కొవిడ్ ఆరంభమైన మొదట్లో ఎక్కువ కలలు వచ్చేవి. ఇన్ఫెక్షన్ బారినపడ్డవారికి ఎక్కువ పీడకలలు వస్తున్నట్లు తేలింది.
* కొవిడ్ వల్ల పీడకలలు పెరగడానికి ఇతమిత్థమైన కారణాలు వెల్లడి కాలేదు. మానసిక ఆరోగ్యం సరిగాలేనప్పుడే సాధారణంగా ఇలాంటివి వస్తుంటాయి. కొవిడ్ సోకిన బృందంలో ఆదుర్దా, కుంగుబాటు లక్షణాలు కనిపించడంతో.. పీడకలలకు ఇవే కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
* ఉద్దేశపూర్వకంగా నిద్రను జాప్యం చేసే ఏకైక క్షీరద జాతి మానవులే.
* నిద్రలేమి వల్ల నొప్పిని తట్టుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది.
* రాత్రివేళ విశ్రమించగానే నిద్రలోకి జారుకోవడానికి 10-15 నిమిషాలు పట్టాలి. ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం పడితే మనలో తీవ్ర అలసట, నిద్రలేమి ఉన్నట్టే.
* ఆహారలేమి కన్నా నిద్రలేమి త్వరగా మరణానికి చేరువ చేస్తుంది.
* 12 శాతం మందికి కలలు బ్లాక్ అండ్ వైట్లోనే వస్తాయి.
* నిద్రలేచిన 5 నిమిషాలకే.. మనం కన్న కలల్లో 50 శాతాన్ని మర్చిపోతాం. మరో ఐదు నిమిషాలు గడిస్తే అందులో 90 శాతం చెరిగిపోతాయి.
నివారణ ఎలా?
స్వల్ప, దీర్ఘకాల ఇన్సోమ్నియాకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తో చికిత్స చేయవచ్చు. చిన్నపాటి నిద్ర సమస్యలను కొన్ని సూత్రాల ద్వారా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి..
* నిద్రించడం- మేల్కోవడంలో క్రమపద్ధతిని పాటించాలి.
* కళ్లు మూతలు పడుతూ.. సహజసిద్ధంగా నిద్ర సంకేతాలు కలిగినప్పుడు పడకపైకి వెళ్లాలి. ఇదేరీతిలో మెలకువ భావన వచ్చినప్పుడు మంచం వీడాలి.
* ఒత్తిడి భావనలు కలిగించే అంశాలను పరిమితం చేసుకోవాలి.
* కుంగుబాటు, ఆదుర్దా భావనలను స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలి.
* కాంతి వల్ల నిద్రకు అవరోధం కలగనివ్వకూడదు. పడకగదిలో వీలైనంత చీకటి ఉండాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
* నిద్రకు కొద్దిసేపటి ముందు ఆహారం తీసుకోవద్దు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్