తాగి విమానం ఎక్కిన ఇద్దరు ప్రయాణికుల అరెస్టు

మద్యం మత్తులో తూలుతూ దిల్లీలో విమానం ఎక్కిన ఇద్దరిని పట్నాలో దిగగానే అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. దిల్లీ-పట్నా ఇండిగో విమానంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

Published : 10 Jan 2023 05:39 IST

 దిల్లీ-పట్నా విమానంలో ఘటన

పట్నా: మద్యం మత్తులో తూలుతూ దిల్లీలో విమానం ఎక్కిన ఇద్దరిని పట్నాలో దిగగానే అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. దిల్లీ-పట్నా ఇండిగో విమానంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పూర్తిగా మత్తులో తూలుతూ ఈ ఇద్దరూ విమానం ఎక్కారని సదరు సంస్థ పట్నా విమానాశ్రయం పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిందితులను హాజీపుర్‌కు చెందిన నీతీశ్‌, రాహుల్‌గా గుర్తించారు. బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉండటంతో సంబంధిత చట్టం కింద వీరిని అరెస్టు చేశారు.

ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసు

ముంబయి: పారిస్‌-దిల్లీ విమానంలో డిసెంబరు 6న జరిగిన రెండు ఘటనలకు సంబంధించి ఎయిరిండియా నిబంధనలు ఉల్లంఘించినట్లు డీజీసీఏ గుర్తించింది. ఎందుకు మీ సంస్థ మీద చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ సోమవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఒక ఘటనలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు సిబ్బంది సూచనలను పట్టించుకోకుండా టాయిలెట్‌ రూంలో పొగ తాగుతూ ఉండిపోయాడు. మద్యం మత్తులో ఉన్న మరో ప్రయాణికుడు మహిళ సీటులో మూత్రవిసర్జన చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని