‘జోషీమఠ్’పై అమిత్షా సమీక్ష
జోషీమఠ్కి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఆర్కే సింగ్, భుపేంద్ర యాదవ్, గజేంద్ర షెకావత్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దిల్లీ, దేహ్రాదూన్: జోషీమఠ్కి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఆర్కే సింగ్, భుపేంద్ర యాదవ్, గజేంద్ర షెకావత్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాదకరంగా మారిన భవనాల తొలగింపు, ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపు ప్రధాన అంశాలుగా చర్చించారు. మరోవైపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న హోటల్ మలర్, మౌంట్ వ్యూ భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ అధికారులు, సదరు యజమానులు ఒప్పందానికి రావడంతో గురువారం ఈ పని ప్రారంభించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇదే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ఉత్తరాఖండ్ హైకోర్టు శాశ్వత పరిష్కారానికి పటిష్ఠ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి, ఆ నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.50 లక్షల చొప్పున గురువారం సాయంత్రానికి లేదా శుక్రవారం అందుతాయని ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ తెలిపారు. జోషీమఠ్లో పలు సైనిక భవనాలూ దెబ్బతినడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. జోషీమఠ్, దాని పరిసర ప్రాంతాల నుంచి బలగాలను తరలించింది.
మరికొన్ని ప్రాంతాల్లో నేల కుంగుబాటు
జోషీమఠ్లోనే కాకుండా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయి ఇళ్లు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా కర్ణప్రయాగ, లండౌర్ ప్రాంతాల్లో 2015 నుంచి ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణప్రయాగలో దెబ్బతిన్న ఇళ్లలో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చమోలీ జిల్లా కలెక్టర్ తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం ఐఐటీ రూర్కీ సాయం తీసుకుంటున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు