చైనా జలఖడ్గానికి భారత్ కట్టడాలు
ఇరు దేశాల సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా భారీ ప్రాజెక్టు నిర్మించనుందనే సమాచారంతో భారత్ అప్రమత్తమైంది. పై నుంచి ఉన్నపళంగా వచ్చే వరదను అడ్డుకోడానికి ఓ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
డ్రాగన్ ఎత్తుకు పైయెత్తు
దిల్లీ: ఇరు దేశాల సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా భారీ ప్రాజెక్టు నిర్మించనుందనే సమాచారంతో భారత్ అప్రమత్తమైంది. పై నుంచి ఉన్నపళంగా వచ్చే వరదను అడ్డుకోడానికి ఓ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. బ్రహ్మపుత్ర నదీజలాలను ఆయుధంగా వాడుకొని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లపై ఎక్కుపెట్టేలా చైనా పన్నిన వ్యూహానికి ఇది భారత్ విరుగుడుగా చెప్పవచ్చు. ఇప్పటికే భారత ఈశాన్య ప్రాంతంలోకి టిబెట్ తదితర ప్రాంతాల నుంచి ప్రవహించే నదులపై బీజింగ్ ఆనకట్టలు కట్టింది. దీంతో కీలక సమయాల్లో వీటి నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పదు. వీటికి తోడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోని ‘మెడాగ్’ వద్ద దాదాపు 60,000 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారీ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్రణాళికలు మొదలుపెట్టింది. దీంతో భారత్ అప్రమత్తమై రానున్న ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమైంది. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లాలో భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. 11 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇది మన దేశంలో ఇప్పటికే ఉన్న అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టు కంటే అయిదు రెట్లు పెద్దది. దీని ‘ప్రీ ఫీజబిలిటీ’ నివేదికను ఇప్పటికే నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ సిద్ధం చేసింది.
* బ్రహ్మపుత్రపై మెడాగ్ వద్ద చైనా భారీ ప్రాజెక్టు నిర్మిస్తే.. కరవు సమయంలో దిగువ ప్రాంతాలకు హఠాత్తుగా నదీప్రవాహం తగ్గించడం.. లేదా కృత్రిమ వరదలు సృష్టించే అవకాశం ఉండటం భారత్కు ఆందోళనకరమే. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోడానికే ఎగువ సియాంగ్లో డ్యామ్ ప్రతిపాదనను భారత్ ముందుకు తెచ్చింది. దీని నిర్మాణం పూర్తయితే నది ఎగువ భాగంలోని చైనా నుంచి వచ్చిపడే వరదనీటిని నిల్వ చేసేలా ‘బఫర్ స్టోరేజీ’కి కూడా ఇది ఉపయోగపడనుంది. 900 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసేలా దీన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. బ్రహ్మపుత్రపై భారత్ ఇప్పటికే నిర్మించిన సుబన్సిరీ హైడ్రో ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభించే అవకాశం ఉంది. ఇది దాదాపు 2,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
* టిబెట్ పీఠభూమిలోని 46,000 హిమనదాల నుంచి సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, మెకాంగ్, ఐరావతి, యాంగ్ ట్సే, యెల్లో నదులు పుడుతున్నాయి. 200 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే ఇవి ఆసియా ఖండానికి జీవనదులు. టిబెట్ పీఠభూమిలో చైనా 55కు పైగా జలాశయాలను నిర్మించింది. అయినా చైనాలో అత్యధిక రాష్ట్రాలు ఇప్పటికీ తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీరు, విద్యుత్తు అవసరాలు తీర్చడానికి బ్రహ్మపుత్రపై బృహత్తర ప్రాజెక్టు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ నదిని చైనా మళ్లిస్తే భారత్పై ప్రతికూల ప్రభావం అనివార్యం. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తినా.. భారీ వరద అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లను ముంచెత్తడం ఖాయం. దీన్ని నివారించడానికి చైనా ఏటా జూన్ - అక్టోబరు మధ్యకాలంలో నీటి విడుదలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని అందిస్తానని గతంలో భారత్కు మాట ఇచ్చినా.. 2017 నాటి డోక్లాం ఘర్షణల తరవాత సమాచార మార్పిడిని నిలిపివేసింది. 2018లో ఈ ప్రక్రియ మళ్లీ మొదలైనా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..