విఘ్నాలేవీ లేకుండా చూడు స్వామీ.. ఏటీఎం చోరీకి వచ్చి దేవుణ్ని ప్రార్థించిన దొంగ

ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ.. విఘ్నాలేవీ లేకుండా తన పని విజయవంతమవ్వాలంటూ దేవుణ్ని ప్రార్థించాడు! కర్ణాటక రాజధాని బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో ఈ నెల 14న ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

Updated : 20 Jan 2023 08:54 IST

ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ.. విఘ్నాలేవీ లేకుండా తన పని విజయవంతమవ్వాలంటూ దేవుణ్ని ప్రార్థించాడు! కర్ణాటక రాజధాని బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో ఈ నెల 14న ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రంగనాథపురలోని ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేసే కరిచితప్పకు.. ఏటీఎంల్లో దొంగతనాలకు ప్రయత్నించడం అలవాటు. ఇందుకోసం- పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను ఎంచుకునేవాడు. రాత్రుళ్లు వచ్చి దొంగతనాలకు ప్రయత్నించేవాడు. అదే తరహాలో ఈ నెల 14న రాత్రివేళ బాగా మద్యం తాగి.. కామాక్షిపాల్య ప్రాంతంలోని కావేరీపుర్‌ జయలక్ష్మి కాంప్లెక్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలోకి వెళ్లాడు. దొంగతనం చేసే ముందు సీసీటీవీని చూస్తూ ప్రార్థనలు చేశాడు. అనంతరం ఏటీఎంను తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని