లాయర్ల సమ్మెల నివారణపై ఇంకెంతకాలం చర్చిస్తారు?
రాష్ట్రాల్లో న్యాయవాదులు సమ్మెలకు దిగడాన్ని నివారించే పక్కా ప్రణాళికను రూపొందించడంలో భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
బీసీఐ జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దిల్లీ: రాష్ట్రాల్లో న్యాయవాదులు సమ్మెలకు దిగడాన్ని నివారించే పక్కా ప్రణాళికను రూపొందించడంలో భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. లాయర్ల వృత్తిపరమైన మర్యాదలపై నియమాలను బలోపేతం చేయాలని సూచించింది. న్యాయవాదులు సమ్మెలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అతిక్రమణకు గురవుతున్నాయని కామన్కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘‘లాయర్ల సమ్మెల్ని నివారించేలా ఏం చర్యలు చేపట్టాలో చెప్పడానికి ఇంకెంతకాలం చర్చలు జరుపుతారు? బార్ కౌన్సిలే ఈ పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ ప్రక్రియను మీరెప్పుడో తాపీగా చేస్తామంటే మేం అనుమతించబోం’’ అని స్పష్టంచేసింది. పక్కా కార్యాచరణతో రావాలని సూచిస్తూ విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.
సుప్రీంలో విచారణకు రాని బిల్కిస్ బానో పిటిషన్
దిల్లీ: గోద్రా అల్లర్ల సమయంలో (2002) గర్భిణిగా ఉన్న తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి.రవికుమార్ల ధర్మాసనం ముందు బిల్కిస్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఈ న్యాయమూర్తులు ఇద్దరూ అనాయాస మరణానికి సంబంధించిన మరో పిటిషను విచారిస్తున్న అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నందున వీలుపడలేదు. కాబట్టి బిల్కిస్ పిటిషను విచారణకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా మరో తేదీ కేటాయించనున్నారు.
జన్యుమార్పిడి ఆవాల ముప్పుపైనే మా ఆందోళన
జన్యుమార్పిడి (జీఎం) ఆవాల విషయంలో ఇతర అంశాల కంటే వాటివల్ల ఎదురయ్యే ముప్పుపైనే ప్రధానంగా తమకు ఆందోళన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటికి పర్యావరణ అనుమతుల్ని కొన్ని షరతులకు లోబడి కేంద్రం ఇవ్వడంపై జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. డీఎంహెచ్-11 రకం జీఎం ఆవాలను ఉపయోగించి కొత్త వంగడాలను అభివృద్ధిపరచడానికి గత ఏడాది అక్టోబరు 25న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ‘జన్యు ఇంజినీరింగ్ మదింపు సంఘం’ (జీఈఏసీ) అనుమతించింది. ఇలాంటివాటిని పర్యావరణంలోకి విడుదల చేయడం వల్ల తలెత్తే పరిణామాలపై స్వతంత్ర సంస్థలు అన్నికోణాల్లో పరిశీలించి నివేదికలు ఇచ్చేవరకు జీఎం పంటలపై మారటోరియం విధించాలని సుప్రీంకోర్టును కోరుతూ ఉద్యమకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపైన్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ధర్మాసనం పరిశీలించింది. అన్ని అంశాలనూ సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు.
జీవన సంకల్పం ప్రక్రియలో మేజిస్ట్రేట్ అనుమతి నిబంధన తొలగింపు
సుదీర్ఘ కాలంగా వైద్య చికిత్స పొందుతూ కోలుకుంటారనే ఆశ కోల్పోయిన వ్యక్తులకు అనాయాస మరణాన్ని ప్రసాదించడంలో కీలకమైన ‘జీవన సంకల్పం’ అమలులో సంక్లిష్టమైన నిబంధనను సుప్రీంకోర్టు తొలగించింది. అటువంటి వ్యక్తులకు ప్రాణాధార వ్యవస్థల నిలిపివేతకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను రద్దు చేసింది. అనాయాస మరణంపై సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో గౌరవప్రదంగా మరణించడాన్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇందుకు కొన్ని నిబంధనలను నిర్దేశించింది. చికిత్సకు లొంగని వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు... తమకు వైద్యాన్ని ఎప్పుడు నిలిపివేయాలనే విషయమై ముందస్తుగా రాసుకొన్న ‘జీవన సంకల్పం’(లివింగ్ విల్) నమోదుకు ఆ నిబంధనలు అవరోధంగా మారడంతో పునఃపరిశీలించాలన్న అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ‘జీవన సంకల్పం’ పత్రంపై సంబంధిత వ్యక్తి...ఇద్దరు సాక్షుల సమక్షంలో స్వచ్ఛందంగా సంతకం చేయాలని, దానిపై నోటరీ లేదా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 2018లో పేర్కొన్న...జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఇద్దరు సాక్షుల సంతకాల ప్రక్రియ స్థానంలో తాజా నిబంధనను చేర్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు