సర్వోదయ సమాజ సాధనే లక్ష్యం
‘‘భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బి.ఎన్.రావు వంటి మేధావులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు చూపిన బాటలో ముందడుగు వేయడమే మన బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
అది మనందరి బాధ్యత
గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఈనాడు, దిల్లీ: ‘‘భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బి.ఎన్.రావు వంటి మేధావులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు చూపిన బాటలో ముందడుగు వేయడమే మన బాధ్యత. అందరి అభ్యున్నతి కోరిన మహాత్ముడి ఆదర్శం సర్వోదయ సమాజ సాధనే లక్ష్యం కావాలి. దేశంలో ఎంతో భిన్నత్వం ఉన్నా మనం ఒకటిగా నిలిచామంటే అది కాలపరీక్షలో నిలబడిన మన రాజ్యాంగం గొప్పదనమే’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘ఆర్థికరంగంలో మనం సాధించిన పురోగతి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గతేడాది భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఆర్థిక అనిశ్చితులు ఏర్పడినప్పుడు భారత్ ఈ ఘనత సాధించడం గమనార్హం’’ అని చెప్పారు.
కొవిడ్ను గట్టిగా ఎదుర్కొన్నాం
‘‘కొవిడ్ మహమ్మారి నాలుగో ఏట ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవృద్ధిని ఇది ప్రభావితం చేసింది. తొలినాళ్లలో భారత ఆర్థికవ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసినా.. సమర్థవంతమైన నాయకత్వంతో దాన్ని గట్టిగా ఎదుర్కొని, త్వరగానే ఈ అగాధం నుంచి బయటపడి మనం పురోగమనం మొదలుపెట్టగలిగాం. ఇపుడు వైరస్లకు భయపడాల్సిన అవసరం లేదు. మన నాయకత్వం, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, అధికారులు, కరోనా యోధులు కలిసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిని కల్పించగలిగారు’’ అని రాష్ట్రపతి అభినందించారు.
ఉచిత రేషన్ చారిత్రక నిర్ణయం
‘‘ప్రభుత్వం మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ భారత్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2020 మార్చిలో ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ప్రభుత్వం పేదలకు కష్టకాలంలో ఆహార భద్రతను కల్పించింది. ఈ సహాయాన్ని మరింత విస్తరిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా 81 కోట్ల లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదో చారిత్రక నిర్ణయం. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నూతన విద్యావిధానాన్ని తెచ్చుకున్నాం. డిజిటల్ ఇండియా మిషన్ గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించగలుగుతోంది. అంతరిక్ష రంగంలో ఎన్నాళ్లనుంచో పెండింగులో ఉన్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ఇందులోకి ఆహ్వానించాం. ఇండియా మార్స్ మిషన్కు మహిళలు నేతృత్వం వహిస్తూ మన ఆడపడుచులు ఎవరికీ తక్కువకాదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ఇక ఎంతమాత్రం నినాదాలకే పరిమితం కాదు. ప్రజా భాగస్వామ్యంతో బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమం విస్తరించింది. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వివిధ విద్యాసంస్థలను సందర్శించినప్పుడు యువ మహిళలు కనబరిచిన ఆత్మవిశ్వాసం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసమూ ప్రభుత్వం కృషి చేస్తోంది.’’
జీ-20 నాయకత్వం గొప్ప అవకాశం..
‘‘విభిన్న ప్రపంచ వేదికలపై మనం తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది భారత్ జీ-20 కూటమికి నాయకత్వం వహిస్తోంది. భూతాపం పెరగటం, వాతావరణంలో తీవ్ర మార్పుల వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి భారత్ నాయకత్వం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఐక్యరాజ్య సమితి భారత్ సూచనలను అంగీకరించి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఎక్కువమంది వీటిని స్వీకరించడం మొదలుపెడితే పర్యావరణంతోపాటు ఆరోగ్యానికీ మంచిదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..