దేశీయ విపణిలోకి నాసికా టీకా
కొవిడ్-19 వ్యాధికి నాసికా టీకా ‘ఇన్కొవ్యాక్’ దేశీయంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి (స్వతంత్రహోదా) జితేంద్రసింగ్ సమక్షంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం దిల్లీలో ఈ టీకాను విడుదల చేశారు.
‘ఇన్కొవ్యాక్’ను విడుదల చేసిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ
కొవిన్ పోర్టల్లో లభ్యం
ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్
ఈనాడు, బిజినెస్ బ్యూరో: కొవిడ్-19 వ్యాధికి నాసికా టీకా ‘ఇన్కొవ్యాక్’ దేశీయంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి (స్వతంత్రహోదా) జితేంద్రసింగ్ సమక్షంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం దిల్లీలో ఈ టీకాను విడుదల చేశారు. కరోనాకు ప్రపంచంలోనే ఇదే తొలి నాసికా టీకా. దీన్ని ఆవిష్కరించిన ఘనత హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు దక్కింది. ‘ఇన్కొవ్యాక్’ టీకాను 2 ప్రాథమిక డోసులకు, బూస్టర్ డోసుకూ వినియోగించొచ్చు. ఈ టీకాకు ప్రైవేటు మార్కెట్లో ఒక డోసుకు రూ.800 ధర నిర్ణయించారు. ప్రభుత్వానికి రూ.350కే లభిస్తుంది. తాజాగా కొవిన్ పోర్టల్లో దీనిని పొందుపరిచారు. వాషింగ్టన్ యూనివర్సిటీ అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. కేంద్రం ‘కొవిడ్ సురక్ష’ కింద నిధులు సమకూర్చి సహకరించింది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
‘ఇన్కొవ్యాక్’ టీకాను నిల్వ చేయడం, రవాణా, భద్రపరచడంతోపాటు ప్రజలకు వేయడమూ సులువు. పోలియో చుక్కల మందును నోట్లో వేసినట్లుగానే... టీకా చుక్కలను ముక్కులో వేస్తే సరిపోతుంది. సిరంజి అవసరమే లేదు కొవిడ్ వైరస్లో భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ టీకాను నవీకరించేఅవకాశం ఉండటం మరో సానుకూల అంశం. దీనికి వీలుగా వెక్టార్ ఆధారిత ప్లాట్ఫామ్మీద ఈ టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. అందువల్ల దీనిని ‘ఫ్యూచర్ రెడీ’ టీకాగా భావిస్తున్నారు. దీనిపై 2 ప్రాథమిక డోసుల క్లినికల్ పరీక్షలను సంస్థ దేశవ్యాప్తంగా 14చోట్ల 3,100 మంది వాలంటీర్లపై, బూస్టర్ డోసు పరీక్షలను 875 మందిపై నిర్వహించింది. రోగనిరోధకశక్తిని ఈటీకా కల్పించడమేగాక భద్రమైనదని నిర్ధారణ అయినట్లు పేర్కొంది.
ఆవిష్కరణలూ చేయగలమని నిరూపించింది: ‘ఇన్కొవ్యాక్’ టీకా ఆవిష్కరణ ఎంతో గొప్ప మైలురాయిగా మంత్రి మన్సుఖ్ మాండవీయ అభివర్ణించారు. మన దేశం ప్రపంచానికి మందులు అందించటమే కాకుండా.. ఆవిష్కరణలూ చేయగలదని రుజువైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న టీకాల్లో 65% మన దేశం నుంచే అందిస్తున్నట్లు తెలిపారు.
700 కోట్ల డోసుల టీకాలు అందించాం
- డాక్టర్ కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
నాసికా టీకాతో ఒక కొత్త ‘వ్యాక్సిన్ డెలివరీ ప్లాట్ఫామ్’ను కనుగొన్నట్లు అయిందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇలాగే మున్ముందు కొత్త టీకాలు తీసుకొస్తామన్నారు. ఇప్పటివరకూ వివిధ రకాల టీకాలను, 700 కోట్ల డోసులు ఉత్పత్తి చేసిన ఘనత తమకుందన్నారు. కొవిడ్ ముప్పును ఎదుర్కోవడానికి మనదేశం నుంచి 150 దేశాలకు టీకాలు సరఫరా చేసినట్లు సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. కొవిడ్పై పోరాటానికి, ఇన్కొవ్యాక్ టీకాతో మరోఆయుధం మన చేతిలో ఉన్నట్లు అవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!