దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
ఘనమైన భారత భిన్నత్వానికి ప్రతీకగా గురువారం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దిన వేడుకలు కనులపండువగా జరిగాయి.
దిల్లీ: ఘనమైన భారత భిన్నత్వానికి ప్రతీకగా గురువారం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దిన వేడుకలు కనులపండువగా జరిగాయి. సాధించిన ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికల్లో వివరించాయి. రాష్ట్రంలో మద్య వినియోగం తగ్గించేందుకు కొత్త అబ్కారీ విధానం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరులో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యువతకు ప్రతినెలా నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించారు.
కశ్మీర్లో 32 మందికి అవార్డులు
కశ్మీర్ లోయలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గణతంత్ర దిన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పొరుగు దేశం పిలుపుతో జమ్మూకశ్మీర్లో చిందిన ప్రతి రక్తపుబొట్టుకు, కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకుంటామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన ప్రసంగంలో అన్నారు. కశ్మీరీ పండిట్ ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శ్రీనగర్ లాల్చౌక్లోని క్లాక్టవర్పై గత 30 ఏళ్లలో రెండోసారి జాతీయ పతాకం ఎగిరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం విశిష్ట సేవలు అందించిన 32 మందిని ప్రభుత్వ అవార్డులకు ఎంపిక చేసింది.
* ఉత్తర గోవాలోని సత్తారీ తాలూకాలో గల చరిత్రాత్మక నానుస్ కోటలో తొలిసారిగా గణతంత్ర వేడుకల గౌరవ వందన సమర్పణ జరిగింది. 1852లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ చెలరేగిన భారీ తిరుగుబాటును ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.
* క్రికెటర్ రిషబ్ పంత్కు ప్రమాదం జరిగిన సమయంలో.. అతనిని కాపాడిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజిత్ నయన్, స్థానికులైన నిశు, రజత్లను రూ.లక్ష చొప్పున నగదు బహుమతులతో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి సత్కరించారు.
విదేశాల్లో మువ్వన్నెల రెపరెపలు
లండన్: వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు గురువారం ఘనంగా 74వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, భూటాన్ ప్రధానులు బెంజమిన్ నెతన్యాహు, ఆంథోని అల్బనీస్, లోటె షెరింగ్ భారత్కు శుభాకాంక్షలు తెలిపారు. బీజింగ్లోని భారత ఎంబసీలో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి ప్రదీప్ రావత్ రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలను చదివి వినిపించారు. మాస్కోలోని భారత ఎంబసీలో జరిగిన వేడుకలో రాయబారి పవన్ కపూర్ ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. పాక్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారత ఎంబసీలోనూ వేడుకలు జరిగాయి. నేపాల్లో భారత రాయబారి శ్రీ నవీన్ శ్రీవాత్సవ పతాకావిష్కరణ చేశారు. శ్రీలంకలో భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లే కొలంబోలోని ఇండియా హౌస్ వేడుకల్లో పాల్గొన్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షల సందేశం పంపారు. మాల్దీవులు, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లలోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్