సంక్షిప్త వార్తలు(6)
అంతరించిపోతున్న పులులను రక్షించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషను విచారణ సందర్భంగా.. దేశంలోని 53 అభయారణ్యాల్లో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదించింది.
దేశంలోని 53 అభయారణ్యాల్లో 2,967 పులులు
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
దిల్లీ: అంతరించిపోతున్న పులులను రక్షించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషను విచారణ సందర్భంగా.. దేశంలోని 53 అభయారణ్యాల్లో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 70 శాతానికి సమానం. 2018 నాటి నివేదిక మేరకు ఈ వివరాలు సమర్పిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. న్యాయవాది అనుపమ్ త్రిపాఠి అయిదేళ్ల కిందట దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ పిటిషను దాఖలు చేశారు. దేశంలో పులుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి కోర్టుకు తెలిపారు.
వస్త్ర పరిశ్రమ వ్యర్థాల శుద్ధికి కొత్త ప్రక్రియ
దిల్లీ: వస్త్ర పరిశ్రమ విడుదల చేసే వ్యర్థ జలాలను రెండు అంచెల్లో శుద్ధి చేసి సహజ జల వనరుల్లోకి వదిలే ప్రక్రియను ఐఐటీ-జోధ్పుర్ పరిశోధకులు కనుగొన్నారు. తొలి అంచెలో ఎలెక్ట్రో కెమికల్ ప్రాసెసింగ్ చేసి, రెండో అంచెలో గొంగళిపురుగు నిర్మాణాన్ని పోలిన జడ్ఎన్వో కార్బన్ నానో ఫైబర్లతో కాలుష్యాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ఇది. వస్త్ర పరిశ్రమ వదిలే వ్యర్థ జలాల్లోని రంగులు నీటి వనరుల్లో కలిసి మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని చేస్తున్నాయి. ఈ జలాల్లో భార లోహాలు, సేంద్రియ పదార్థాలు, రసాయనాలు కూడా ఉంటాయి. ఐఐటీ పరిశోధకులు అటు రంగులనూ, ఇటు సేంద్రియ కాలుష్యాలనూ తొలగించే రెండు అంచెల ప్రక్రియను కనుగొనడం పెద్ద ముందంజ.
17 మంది పాక్ ఖైదీల అప్పగింత
దిల్లీ: పాకిస్థాన్కు చెందిన 17 మంది ఖైదీలను భారత్ ఆ దేశానికి అప్పగించింది. దేశంలోని వివిధ జైళ్లలో బందీలుగా ఉన్న వీరిని శుక్రవారం అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు పాక్ హైకమిషన్ కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది.
బెయిలుపై విడుదలైన ఆశిష్ మిశ్ర
లఖింపుర్ఖేరి (యూపీ): సుప్రీంకోర్టు ఎనిమిది వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో కేంద్ర మంత్రి అజయ్కుమార్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. లఖింపుర్ఖేరి జిల్లా జైలు సీనియర్ సూపరింటెండెంట్ విపిన్కుమార్ మిశ్ర ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పటిష్ఠమైన భద్రత నడుమ జైలు వెనుక గేటు నుంచి ఆయనను బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. 2021 అక్టోబర్ 3న లఖింపుర్ఖేరిలో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా హింస చెలరేగి 8 మంది మృతిచెందిన కేసులో ఆశిష్ మిశ్ర విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బెయిలు కాలంలో ఈయన ఉత్తర్ప్రదేశ్లో కానీ, దిల్లీలో కానీ ఉండరాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె.మహేశ్వరిల ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది.
అధికార భాషగా సంస్కృతం ఎందుకు కాకూడదు?: జస్టిస్ బోబ్డే
నాగ్పుర్: భారతదేశానికి అధికార భాషగా సంస్కృతం ఎందుకు ఉండకూడదని మాజీ సీజేఐ జస్టిస్ శరద్ బోబ్డే ప్రశ్నించారు. 1949లో వచ్చిన వార్తా పత్రికల కథనాల ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సైతం ఇదే విషయాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోందన్న ఆయన.. ఆ మేరకు మార్పు రావాలని ఆకాంక్షించారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో శుక్రవారం నాగ్పుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోబ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆదర్శ మార్గంలో మహాకాళేశ్వరాలయం
‘జీరో వేస్ట్’ విధానం దిశగా అడుగులు
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ మహాకాళేశ్వరాలయం ప్రత్యేకత చాటుకోనుంది. వ్యర్థాలను సంపూర్ణంగా పునర్వినియోగించేందుకు (జీరో వేస్ట్) చర్యలు చేపడుతోంది. తద్వారా మధ్యప్రదేశ్లో జీరో వేస్ట్ విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఆలయంగా నిలవనుంది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే ఈ ఆలయంలో పెద్దఎత్తున పూల దండలు, ఇతర పూజసామగ్రి, ప్లాస్టిక్ సీసాలు, ఆహార వ్యర్థాలు పోగుపడుతున్నాయి. రోజూ సుమారు 10 క్వింటాళ్ల మేర వ్యర్థాలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఇప్పటివరకూ వీటిని పురపాలక శాఖకు అప్పజెప్పేవారు. ఇకపై వీటిని ప్రత్యేక పద్ధతుల్లో వేరు చేసి రీసైక్లింగ్ చేయడం ద్వారా పునర్వినియోగించనున్నారు. కంపోస్టు ఎరువును కూడా తయారు చేసి ప్రాంగణంలోని మొక్కలకు వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్లాంటును ఆలయానికి చెందిన స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. వంట గ్యాసును కూడా ఉత్పత్తి చేసి భక్తులను అన్నం వండటానికి వినియోగించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?