దుబాయ్‌ వెళ్లడానికి జాక్వెలిన్‌కు అనుమతి

నగదు అక్రమ చలామణి అభియోగంపై కోర్టు విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు దిల్లీ కోర్టులో ఊరట లభించింది.

Published : 28 Jan 2023 05:05 IST

దిల్లీ: నగదు అక్రమ చలామణి అభియోగంపై కోర్టు విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆమె అభ్యర్థించడంతో అనుమతి మంజూరు చేస్తున్నట్లు కోర్టు శుక్రవారం ప్రకటించింది. ఆర్థిక మోసాలకు పాల్పడిన సుకేష్‌ చంద్రశేఖర్‌ కేసుకు సంబంధించి రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు జాక్వెలిన్‌పై ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని