Tamil Nadu: అమెరికాకే పరిష్కారాన్ని చూపారు!
భారీ కొండ చిలువలు విధ్వంసం సృష్టిస్తుంటే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుంది. వాటి నుంచి రక్షణ సర్కారుకు తలకుమించిన భారమైంది.
పాములు పట్టే ‘ఇరుళర్’ తెగ వారికి పద్మశ్రీ
పలు దేశాల్లో శిక్షణ ఇస్తున్న ఇద్దరు తమిళులు
ఈనాడు, చెన్నై: భారీ కొండ చిలువలు విధ్వంసం సృష్టిస్తుంటే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుంది. వాటి నుంచి రక్షణ సర్కారుకు తలకుమించిన భారమైంది. ఈ సమస్యకు.. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలోని అరుదైన ఇరుళర్ తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిష్కారం చూపారు. ‘ఇండియా గ్రేట్’ నినాదాల్ని మారుమోగించారు. వారిరువురే.. వడివేల్ గోపాల్, మాసి సడైయన్. విషపూరిత పాములు పడుతూ ప్రపంచవ్యాప్తంగా వీరు చేస్తున్న సేవలకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఇరుళర్ తెగ... జనాభా లెక్కల ప్రకారం అత్యంత అరుదైనది. ‘ఇరుళర్’ అంటే తమిళంలో ‘చీకటి’ అనే అర్థం. వారి జీవితాలు ఎంతో దుర్భరం. చదువు, ఉద్యోగాలు లేవు. ఎవరికైనా ఉద్యోగం వస్తే.. దాన్ని గొప్ప విషయంగా చూస్తారు. అలాంటి తెగకు చెందిన ఈ ఇద్దరూ వారసత్వంగా వస్తున్న పనిలోనే నైపుణ్యం సంపాందించి, దానికి సాహసాన్ని జోడించి కీర్తి పురస్కారాన్ని దక్కించుకున్నారు.
కన్నుపడితే అంతే..
వడివేల్ గోపాల్, మాసి సడైయన్లది చెంగల్పట్టు జిల్లా చెన్నేరి అనే చిన్న గ్రామం. చిన్నతనం నుంచి అడవి జీవితమే. తండ్రుల నుంచి పాములు పట్టే విద్య నేర్చుకున్నారు. ఎంతటి విషపూరిత పామునైనా సులువుగా.. వేగంగా లొంగదీసుకుంటారు. 2016-17 మధ్య వీరి ప్రతిభ వెలుగులోకి వస్తున్న సమయంలో ప్రఖ్యాత అమెరికన్- ఇండియన్ సర్పాల పరిశోధకుడు (హెర్పెటాలజిస్ట్) రోములస్ ఎర్ల్ విటేకర్కు విషయం చేరింది. అదే సమయంలో అమెరికాలోని ప్లోరిడాలోని పలు ప్రాంతాల్లో బర్మీస్ పైథాన్లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 15 నుంచి 23 అడుగుల పొడవుతో భయంకరంగా ఉండే ఈ కొండ చిలువలు జంతువులను తినేస్తూ ప్రభుత్వానికే దడ పుట్టించాయి. ఊర్లలోకీ వచ్చేవి. అప్పట్లో ప్లోరిడా ప్రభుత్వం ఈ పైథాన్లను చంపేవారికి నగదు బహుమతుల్ని ప్రకటించింది. వీటిని పట్టేవారిని చూపాలని పోటీల్ని నిర్వహించేది. ఆ ప్రభుత్వం దృష్టికి వడివేల్ గోపాల్, మాసి సడైయన్ గురించి విటేకర్ తీసుకెళ్లారు. దీంతో తమిళ అనువాదకుల్ని పెట్టి మరీ ఈ ఇద్దరినీ ప్లోరిడాకు తీసుకెళ్లారు. సంప్రదాయ పద్ధతుల్లో కొండ చిలువలు పట్టే వీరి తీరు అక్కడి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. అమెరికాలోని నిష్ణాతులు సైతం వెయ్యి మంది కలిసి నెలల తరబడి 106 కొండ చిలువల్ని పడితే.. వీరిద్దరు నెలలోనే 30కిపైగా పట్టేవారు. స్థానికులకు శిక్షణ ఇచ్చేవారు. దీంతో ఇద్దర్ని ఘనంగా సన్మానించారు. తర్వాత పలు దేశాలకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. విష సర్పాలపై పరిశోధన చేసేందుకు థాయ్లాండ్లోని నిపుణులు వీరి సాయం కోరడం విశేషం.
‘జైభీమ్’తో మరింత వెలుగులోకి..
2021లో విడుదలైన ‘జైభీమ్’ చిత్రం ఓ సంచలనం. ఇరుళర్ తెగపై జరుగుతున్న దాడులు, తప్పుడు కేసుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. దీంతో దేశంలో ఈ తెగపై చర్చ మొదలైంది. పలువురు ఆ తెగపై పుస్తకాలూ రాశారు. ఇరుళర్ తెగకు పద్మశ్రీ రావడం ఒక చరిత్రే. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వీరు మొత్తంగా 2.13 లక్షల మంది ఉన్నారు. అటవీ ప్రాంతాల్లోనే వీరి జీవనం. పాములు పట్టుకోవడం, అడవుల్లో తేనె సేకరించడం, పొలాల్లో పనులు వృత్తి. చదువుకున్నవారు తక్కువే. జంతువులతో ఎలా వ్యవహరించాలో వెన్నతో పెట్టిన విద్య. పాము కనిపిస్తే.. వెంటనే విషపూరితమా.. కాదా చెప్పేస్తారు. 1972 వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున వేటగాళ్లుగా కొనసాగుతున్నారు. చెన్నై శివారు ఈసీఆర్లో వడనెమ్మేలి ప్రాంతంలో ‘ఇరుళర్ పాములుపట్టేవారి పారిశ్రామిక సంక్షేమ సంఘం’ (ఐఎస్సీఐసీఎస్) ఏర్పాటైంది. దాదాపు 50ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇక్కడ ఇరుళర్ తెగవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. పాముల నుంచి తీసిన విషం కొన్ని ప్రత్యేకించిన ఔషధ సంస్థలకు ఈ కేంద్రం నుంచి పంపుతున్నారు. దీంతో పాము కాటు ఔషధాలు తయారవుతున్నాయి.
సాహస ప్రయాణం
పద్మశ్రీ అవార్డు తమకు ప్రకటించినప్పుడు వీరు కరూరు జిల్లాలో ఉన్నారు. తమ శ్రమకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ విజయానికి రోములస్ విటేకర్ కారణమని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు స్పందించారు. ఇరుళర్ తెగ వారికి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని, వారి ప్రయాణం సాహసోపేతమైందని, ఆ జ్ఞానాన్ని ఎన్నో దేశాలు అందిపుచ్చుకోవడం గర్వకారణమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా