మధ్యతరగతి మది గెల్చుకోండి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మధ్య తరగతి ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఆ వర్గానికి చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.
కేంద్ర పథకాలతో కలిగిన లబ్ధిని వివరించండి
మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మధ్య తరగతి ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఆ వర్గానికి చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. కేంద్ర బడ్జెట్ వేళ.. ఆదివారం ఆయన మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. ప్రభుత్వ పథకాలతో పేదలు, అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరిందని ప్రధాని ఈ భేటీలో పేర్కొన్నారు. అలాగే మధ్యతరగతికీ ప్రయోజనం కలిగిందని తెలిపారు. ఈ వివరాలను ఆ వర్గానికి తెలియజేయాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో బ్రిటిష్ పాలనను గుర్తుకు తెచ్చే అంశాలు, చట్టాలను గుర్తించి, వాటిని రద్దు చేయాలన్నారు. గడిచిన 8 ఏళ్లలో వివిధ రంగాలకు సంబంధించి మోదీ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి అధికారులు ఈ సమావేశంలో ఒక దృశ్యశ్రవణ సమర్పణ చేశారు. సామాజిక, ఆర్థిక రంగాలపై క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా వివరణ ఇచ్చారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సీలను ప్రారంభించినట్లు వివరించారు. ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరంగా భారీ పరివర్తన జరిగినట్లు చెప్పారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సీట్లు పెరిగాయని, దీనివల్ల విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్.. ప్రభుత్వం ప్రారంభించిన అనేక ప్రాజెక్టులపై మాట్లాడారు. మోదీ సర్కారు చేపట్టిన మంచి పనుల గురించి ప్రచారం చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ సామాజిక మాధ్యమాల గురించి సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వివరణ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లకు సంబంధించిన ముద్రిత ప్రతులను మంత్రులకూ అందజేశారు. ఈ ఏడాది కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు