చరిత్ర సృష్టించిన ఉన్నత విద్యార్థులు
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఏడాది కాలంలో 3.85 కోట్ల నుంచి 4.14 కోట్లకు చేరి రికార్డు సృష్టించింది.
తొలిసారి 4.14 కోట్లకు చేరిన సంఖ్య
కళాశాలల సాంద్రతలో తెలంగాణకు రెండోస్థానం
అత్యధిక కాలేజీలున్న జిల్లాల్లో హైదరాబాద్కు 3, రంగారెడ్డికి 6వ స్థానం
ఇదే అంశంలో ఏపీ 7, తెలంగాణకు 9వ స్థానం
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఏడాది కాలంలో 3.85 కోట్ల నుంచి 4.14 కోట్లకు చేరి రికార్డు సృష్టించింది. నాలుగు కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. మహిళా విద్యార్థుల సంఖ్య గత ఏడాది కాలంలో 1.88 కోట్ల నుంచి 2.01 కోట్లకు పెరిగింది. 2014-15నాటితో పోలిస్తే వీరి సంఖ్య 44 లక్షల (28%) మేర వృద్ధి చెందింది. 2014-15తో పోలిస్తే ఇప్పటికి మొత్తం విద్యార్థుల సంఖ్య 72 లక్షల మేర (21%) పెరిగింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సర్వే వెల్లడించింది. దానిని జాతీయ స్థాయి ఉన్నత విద్య సర్వే (ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్)2020-21 పేరిట ఆదివారం విడుదల చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు, బోధనా సిబ్బంది, మౌలికవసతుల కల్పన, ఆర్థిక అంశాల గురించిన వివరాలు అందులో వివరించింది. 2020-21 సర్వేని తొలిసారి పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించింది. ఆ వివరాలు..
* 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో మొత్తం ప్రవేశాల్లో మహిళా విద్యార్థుల సంఖ్య 45% నుంచి 49%కి పెరిగింది.
* గత ఏడాది కాలంలో ఎస్సీ విద్యార్థుల సంఖ్య 56.57లక్షల నుంచి 58.95 లక్షలకు పెరిగింది. 2014-15లో ఇది 46.06 లక్షలకు పరిమితమైంది.
* ఎస్టీ విద్యార్థుల సంఖ్య ఏడాది కాలంలో 21.6 లక్షల నుంచి 24.1 లక్షలకు చేరింది. 2014-15లో ఇది 16.41 లక్షలమేర ఉంది.
* కాలేజీల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక (ప్రతి లక్షమందికి 62), తెలంగాణ (53), కేరళ (50), హిమాచల్ప్రదేశ్ (50), ఆంధ్రప్రదేశ్ (49), ఉత్తరాఖండ్ (40), రాజస్థాన్ (40), తమిళనాడు (40) టాప్లో ఉన్నాయి.
* అత్యధిక కాలేజీలున్న జిల్లాల జాబితాలో బెంగుళూరు అర్బన్ (1,058), జైపుర్ (671), హైదరాబాద్ (488), పుణే (466), ప్రయాగ్రాజ్ (374), రంగారెడ్డి (345), భోపాల్ (327), నాగ్పుర్ (318) టాప్-8లో నిలిచాయి.
* అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ (8,114), మహారాష్ట్ర (4,532), కర్ణాటక (4,233), రాజస్థాన్ (3,694), తమిళనాడు (2,667), మధ్యప్రదేశ్ (2,610), ఆంధ్రప్రదేశ్ (2,601), గుజరాత్ (2,267), తెలంగాణ (2,062), కేరళ(1,448)లు తొలి 10 స్థానాలను ఆక్రమించాయి.
* అత్యధిక యూనివర్సిటీలున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ (92), ఉత్తర్ప్రదేశ్ (84), గుజరాత్ (83) టాప్-3లో ఉన్నాయి.
* రక్షణ, సంస్కృతం, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్, డిజైన్, స్పోర్ట్స్లాంటి ప్రత్యేక అంశాలున్న యూనివర్సిటీల్లో ప్రవేశాలు పెరిగాయి.
* ఉన్నత విద్యాసంస్థల్లో అత్యధిక విద్యార్థుల నమోదు ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లలో ఉంది.
* 17 విశ్వవిద్యాలయాలు, 4,375 కళాశాలలు కేవలం మహిళల కోసమే పనిచేస్తున్నాయి.
* ప్రతి లక్ష మంది విద్యార్థులకు (18-23 ఏళ్లలోపువారికి) దేశంలో సగటున 31 కాలేజీలు ఉన్నాయి. 2014-15లో ఈ సంఖ్య 27 మాత్రమే.
* ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల సంఖ్య 2019-20లో 94 లక్షలు ఉండగా, 2020-21లో 95.4 లక్షలకు పెరిగింది.
సర్వేలోని మరిన్ని ప్రధానాంశాలు....
* 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో 18-23 ఏళ్లలోపు విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 25.6% నుంచి 27.3%కి చేరింది.
* 2019-20తో పోలిస్తే 2020-21లో ఎస్టీ విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 1.9 పాయింట్ల మేర పెరిగింది.
* 2017-18 నుంచి మహిళ విద్యార్థుల గ్రాస్ఎన్రోల్మెంట్ రేషియో పురుషు విద్యార్థుల గ్రాస్ఎన్రోల్మెంట్ రేషియోను అధిగమించింది.
* 2007-08 నుంచి 2014-15 మధ్యకాలంలో ఎస్టీ విద్యార్థుల వార్షిక ఎన్రోల్మెంట్ 75వేల మేర ఉండగా, 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో వార్షిక ప్రవేశాల సంఖ్య సగటున లక్షకు పెరిగింది.
* 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఓబీసీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ 1.42 కోట్ల నుంచి 1.48 కోట్లకు పెరిగింది. 2014-15నాటితో పోలిస్తే ప్రస్తుతానికి వీరి ఎన్రోల్మెంట్ 36 లక్షల (32%)మేర పెరిగింది.
* ఈశాన్యరాష్ట్రాల విద్యార్థుల సంఖ్య 2014-15లో 9.36 లక్షలమేర ఉండగా, 2020-21నాటికి వారి సంఖ్య 12.06 లక్షలకు చేరింది.
* 79.06% విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉండగా, 11.5% మంది పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్నారు.
* అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 33.5% ఆర్ట్స్, 11.5% మంది సైన్స్, 13.9% మంది కామర్సు, 11.9% మంది ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు చదువుతున్నారు.
* పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో 20.56%మంది సోషయల్ సైన్సెస్, 14.83% మంది సైన్సెస్ చదువుతున్నారు.
* సైన్స్కోర్సుల్లో చేరిన 55.5 లక్షలమంది విద్యార్థుల్లో పురుషుల (26 లక్షలు) కంటే మహిళలే (29.5లక్షలు) అధికంగా ఉన్నారు.
* మొత్తం యూనివర్సిటీల్లో 59% ప్రభుత్వానికి కాగా, 73.1% మంది విద్యార్థులు అందులో చదువుతున్నారు.
* 21.4% ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో 34.5% మంది విద్యార్థులు చేరారు.
* జాతీయ ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో 61% మేర పెరిగింది.
* దేశంలో యూనివర్సిటీలు, యూనివర్సిటీ తరహా విద్యాసంస్థల సంఖ్య 1,113కి, కాలేజీల సంఖ్య 43,796, స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య 11,296కి చేరింది.
* 2020-21లో యూనివర్సిటీల సంఖ్య 70, కాలేజీల సంఖ్య 1,453మేర పెరిగింది.
* 2014-15 నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీల సంఖ్య 353 (46.4%) మేర పెరిగింది.
* జాతీయ ప్రాధాన్య విద్యాసంస్థల సంఖ్య 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో 75 నుంచి 149కి చేరింది.
* 2014-15 తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో 191 కొత్త ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి.
* 2007-08 నుంచి 2014-15మధ్యకాలంలో ఏటా సగటున 50 యూనివర్సిటీలు పెరగ్గా, ఆ తర్వాత కాలంలో సగటున 59 పెరిగాయి.
* 43% యూనివర్సిటీలు, 61.4% కాలేజీలు గ్రామీణప్రాంతాల్లో ఉన్నాయి.
* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో బోధనా సిబ్బంది సంఖ్య 15,51,070కి చేరింది. ఇందులో 57.1% పురుషులు, 42.9% మహిళలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్