సెకనుకు 800 ల్యాప్టాప్ల పారవేత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 800 పాత ల్యాప్టాప్లను పక్కన పడేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
ఈ-వ్యర్థాల్లో 17 రకాల విలువైన లోహాలు
చెత్త నుంచి బంగారం వెలికితీయొచ్చు
మన్కీ బాత్లో ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 800 పాత ల్యాప్టాప్లను పక్కన పడేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. వాటిలో నిక్షిప్తమై ఉండే 17 రకాల విలువైన లోహాలను వెలికితీస్తే ఈ-వ్యర్థాల నుంచి బంగారాన్ని సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ రోజు ప్రతి ఇంట్లో మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు సర్వసాధారణమైపోయాయి. దేశంలో వాటి సంఖ్య వందల కోట్లకు చేరిపోయింది. ఈ-వ్యర్థాన్ని సరిగా వదిలించుకోకపోతే అది పర్యావరణానికి చేటుచేయొచ్చు. దాన్ని సరిగా పునర్వినియోగించుకుంటే సర్క్యులర్ ఎకానమీకి బలమైన వనరుగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను పారబోస్తున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదిక చెబుతోంది. దాని పరిమాణం ఎంతన్నది మీరు ఊహించగలరా? మానవ చరిత్రలో ఇప్పటి వరకు తయారైన వాణిజ్య విమానాలన్నింటినీ కలిపి తూకం వేసినా సమానం కాదు. ప్రస్తుతం ప్రతి సెకనుకు 800 ల్యాప్టాప్లను పారేస్తున్నారు. అయితే విభిన్న శుద్ధికార్యక్రమాల ద్వారా వాటి నుంచి బంగారం, వెండి, రాగి, నికెల్ సహా 17 రకాల విలువైన లోహాలను వెలికితీయొచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ దిశలో పనిచేసే స్టార్టప్లకు ప్రస్తుతం కొదవలేదు. ఇప్పుడు దాదాపు 500 ఈ-వ్యర్థాల రీసైక్లర్స్ పనిచేస్తున్నారు. చాలామంది కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారితో జతకలుస్తున్నారు. ఈ రంగం వేలమందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోంది. బెంగళూరులోని ఈ-పరిసర సంస్థ ఇలాంటి ప్రయత్నం చేస్తోంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుంచి విలువైన లోహాలను వెలికితీసే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అది తయారు చేసింది. అలాగే ముంబయి, ఉత్తరాఖండ్లోని రవుర్కెలా, మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన విభిన్న సంస్థలు మొబైల్ యాప్ ద్వారా టన్నుల కొద్దీ ఈ-వ్యర్థాలను సేకరిస్తున్నాయి. ఇవన్నీ భారత్ను ప్రపంచ రీసైక్లింగ్ హబ్గా మార్చేందుకు దోహదపడుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రజలు కూడా ఈ-వ్యర్థాలను పద్ధతి ప్రకారం పక్కన పెట్టాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
* చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
* దేశీయ పేటెంట్ దరఖాస్తులతో పోలిస్తే దేశం నుంచి విదేశీ పేటెంట్ల కోసం చేస్తున్న దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయని మోదీ వివరించారు.
* ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు పొందిన వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రధాని.. దేశ ప్రజలకు సూచించారు.
తెలంగాణ ఇంజినీరు విజ్ఞప్తితో ‘ఈ’ ప్రస్తావన
నమో యాప్ ద్వారా తెలంగాణకు చెందిన విజయ్ అనే ఇంజినీర్ చేసిన విజ్ఞప్తి మేరకు తాను ఈ-వ్యర్థాల ప్రస్తావన తీసుకొచ్చినట్లు ప్రధాని పేర్కొన్నారు. అలాగే గిరిజన భాషల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన బి.రామకృష్ణారెడ్డి పేరునూ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. వరంగల్ కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాల గొప్పతనాన్ని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!