నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి.
ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం
ఆ వెంటనే సభ ముందుకు ఆర్థిక సర్వే
కేంద్ర ఆర్థిక పద్దును బుధవారం ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
ఈనాడు, దిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి. సెంట్రల్హాలులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వీటికి శ్రీకారం చుడతారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె దిగువ సభలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెడతారు. గురువారం నుంచి ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ జవాబు ఇవ్వనున్నారు. ఆ వెంటనే బడ్జెట్పై చర్చ మొదలవుతుంది.ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. వివిధ శాఖలకు కేటాయింపులపై స్థాయీ సంఘాలు అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించడానికి పార్లమెంటుకు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12వ తేదీ వరకు విరామం ఇవ్వనున్నారు. రెండో దఫా సమావేశాల్లో.. శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక బిల్లుపై చర్చిస్తారు.
అదానీ, గవర్నర్ల తీరుపై చర్చకు విపక్షాల పట్టు
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, తర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6వరకు రెండు విడతలుగా జరిగే పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మంగళవారం దిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. లోక్సభ ఉపనాయకుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభ శ్రీనగర్లో ఉండటంతో కాంగ్రెస్ నేతలెవ్వరూ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు. మంగళవారం వారి డిమాండ్లను తన దృష్టికి తీసుకొస్తామని చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు.
* మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ కుల గణన, అదానీ వ్యాపారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, చైనా చొరబాట్లపై చర్చ కోసం పలు పార్టీలు అడిగాయని, నిబంధనల ప్రకారం, సభాపతి అనుమతిస్తే ఏ అంశంపైనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
* అఖిలపక్ష భేటీలో చైనా చొరబాట్లపై చర్చ చేపట్టాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేతలు డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరించినట్లు తెలిసింది. దేశ భద్రతతో ముడిపడిన ఈ అంశంపై పార్లమెంటులో చర్చించడం సాధ్యంకాదని పేర్కొన్నట్లు సమాచారం.
* బిజూ జనతాదళ్ నేత సస్మిత్పాత్ర..బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇందుకు భారత రాష్ట్ర సమితి(భారాస), టీఎంసీలూ మద్దతు పలికినట్లు తెలిసింది.
* తృణమూల్ కాంగ్రెస్, భారాస, డీఎంకే పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రాల్లో గవర్నర్లు పరిధి మీరి వ్యవహరిస్తున్న తీరుపై చర్చ కోసం డిమాండ్ చేశారు.
* దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వైకాపా డిమాండ్ చేసింది.
పార్లమెంటు క్యాంటీన్లో జొన్న ఉప్మా.. రాగి దోశ
దిల్లీ: జొన్న ఉప్మా, రాగి దోశ, రాగి రవ్వ ఇడ్లీ, సజ్జల కిచిడీ... తరహాలో తృణ ధాన్యాలతో చేసిన పలు ఆహార పదార్థాలు ఇప్పుడు పార్లమెంటు క్యాంటీన్ మెనూలో చోటు దక్కించుకున్నాయి. తృణ ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పార్లమెంటు భవనం క్యాంటీన్లో ఆరోగ్యకరమైన ఈ వంటకాలు అన్నిటినీ ఎంపీలు, సిబ్బంది, సందర్శకులకు అందుబాటులో ఉంచేలా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాట్లు చేయించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తృణ ధాన్యాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే తృణ ధాన్యాల ఆహార పదార్థాలను క్యాంటీన్ మెనూలో చేర్చారు. ఇటీవల శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా తృణ ధాన్యాలతో చేసిన వంటలతో ఎంపీలకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విందునిచ్చిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..