దిల్లీ వర్సిటీలోని మొగల్ గార్డెన్స్.. ఇక గౌతమ బుద్ధ సెంటినరీ
దేశ రాజధానిలోని దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్న మొగల్ గార్డెన్స్ పేరును గౌతమ బుద్ధ సెంటినరీగా మారుస్తున్నట్లు రిజిస్ట్రార్ వికాస్ గుప్తా సోమవారం వెల్లడించారు.
పేరు మారుస్తూ విశ్వవిద్యాలయం నిర్ణయం
దిల్లీ: దేశ రాజధానిలోని దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్న మొగల్ గార్డెన్స్ పేరును గౌతమ బుద్ధ సెంటినరీగా మారుస్తున్నట్లు రిజిస్ట్రార్ వికాస్ గుప్తా సోమవారం వెల్లడించారు. వర్సిటీలోని నార్త్ క్యాంపస్లో ఈ గార్డెన్ ఉంది. ‘‘15 ఏళ్ల క్రితం నిర్మించిన గౌతమ బుద్ధ విగ్రహం గార్డెన్ మధ్యలో ఉంది. ఇది మొగల్ గార్డెన్స్ నమూనాలో లేదు. మొగల్ నిర్మించిన గార్డెనూ కాదు. రాష్ట్రపతి భవన్లో ఉన్న మొగల్ గార్డెన్స్ పేరు మార్పునకు 15 రోజుల ముందే ఈ ప్రతిపాదన దస్త్రం ఉపకులపతి దగ్గరకు వెళ్లింది. మార్చిలో జరిగే పూల ప్రదర్శన కార్యక్రమానికి ముందే పేరు మార్చాలని భావించాం’’ అని ఓ అధికారి అన్నారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న మొగల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మొగల్ గార్డెన్ నమూనా..!
అసలు మొగల్ గార్డెన్ అంటే ఏంటీ, ఎందుకు ఆ పేరుతో పిలుస్తుంటారు అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ‘‘మొగల్ గార్డెన్ అనేది పర్షియన్ నిర్మాణంలో ఉంటుంది. కాలువలు, కొలనులతో పాటు జలపాతాలు ఉంటాయి. నీలిరంగు టైల్స్ ఈ గార్డెన్లో కనిపిస్తాయి. ఇరువైపులా కొండలు, వాటి మధ్యలో నీరు ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. ఈ గార్డెన్లో పూలు, పండ్ల చెట్లు ఉంటాయి. తాజ్మహల్లో ఇలాంటి నమూనా గార్డెన్ ఉంది’’ అని వర్సిటీలోని ఓ అధికారి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని