మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ

ఓ అత్యాచార కేసులో వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూని గుజరాత్‌లోని గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది.

Published : 31 Jan 2023 04:49 IST

తీర్పు వెలువరించిన గాంధీనగర్‌ కోర్టు

గాంధీనగర్‌: ఓ అత్యాచార కేసులో వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూని గుజరాత్‌లోని గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. దీనికి సంబంధించి శిక్ష, తదితర వివరాలను మంగళవారానికి రిజర్వు చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తగినన్ని సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2001 నుంచి 2006 మధ్య ఆశారాం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ శిష్యురాలు 2013లో చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ తీర్పు వెల్లడయింది. మరొక రేప్‌ కేసులో శిక్షననుభవిస్తున్న ఆశారాం బాపూ.. ప్రస్తుతం జోధ్‌పుర్‌ జైలులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని