Union budget 2023: వచ్చే ఏడాది వృద్ధిరేటు 6.8%
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు(జీడీపీ) 2022-23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.
పీపీపీ ప్రకారం మనది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
‘కొవిడ్’ పూర్వ స్థితికి చేరుకున్నాం
రూపాయి పనితీరు భేష్
ఒత్తిళ్లను తట్టుకుని మన ఆర్థిక రంగం నిలబడింది
ఆందోళనకరంగానే కరెంటు ఖాతా లోటు
ఆర్థిక సర్వే వెల్లడి
దిల్లీ: ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు(జీడీపీ) 2022-23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023-24లో అది 6 నుంచి 6.8 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. కొనుగోలు శక్తి (పర్చేజింగ్ పవర్ ప్యారిటీ/పీపీపీ) పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ‘‘అంతర్జాతీయ వృద్ధిని మొదట కరోనా మహమ్మారి దెబ్బతీయగా.. ఆపై రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దానిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వుతో సహా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరించిన వడ్డీరేట్ల పెంపు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపు చర్యలతో ఆ దేశ స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతోంది. దీంతో అనేక దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ విపరీతంగా బలపడుతోంది. ఈ కారణంగా పలు దేశాలు కరెంటు ఖాతా లోటు(సీఏడీ)ను ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దాడి పూర్వస్థితికి చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అనేక దేశాల కంటే ముందువరుసలో నిలిచి పూర్తిస్థాయి రికవరీని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐరోపాలో తలెత్తిన సంక్షోభం(రష్యా-ఉక్రెయిన్ యుద్ధం)తో కూడా మనదేశం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి పనితీరు బాగానే ఉంది. ఇప్పటికీ అధికస్థాయిలో కొనసాగుతున్న అంతర్జాతీయ కమోడిటీ(ముఖ్యంగా ముడి చమురు) ధరలతో సీఏడీ ఆందోళనకరంగా పెరుగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీరు బలంగా ఉంది’’ అని సర్వే వివరించింది.
మూడు ముప్పులు ముంచెత్తాయి
సర్వేపై కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూడు ముప్పులు ముంచెత్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో మిగిలిన దశాబ్దకాలం పాటు భారత వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు మించకుండా ఉంటే దేశ అంచనా వృద్ధి రేటులో తేడా ఉండదన్నారు. పునరుత్పాదక ఇంధన మిళిత లక్ష్యాల సాధనలో మనదేశం గణనీయంగా ముందుకుసాగుతోందని తెలిపారు.
ఆర్థిక సర్వేలో కీలకాంశాలు..
* కొవిడ్ మహమ్మారి సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలోగానీ, లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలోగానీ ఉండదు.
* రుణరేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉంది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుంది.
* అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.
* ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, సీఏడీ విస్తృతమవుతుండడంతో రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చు.
* ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున బలహీనమైన రూపాయి విలువతో సీఏడీ మరింత పెరిగే అవకాశం ఉంది. జులై-సెప్టెంబరు కాలానికి సీఏడీ 4.4 శాతంగా ఉంది. ఇది అంతకు ముందు త్రైమాసికంలో 2.2 శాతంగా, ఏడాది క్రితం 1.3 శాతంగా ఉండేది.
* ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయి.
* స్థిరాస్తి రంగంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైంది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదం చేసింది.
* 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే ‘సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి పరిశ్రమల’(ఎంఎస్ఎంఈ) రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
* కొవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ వల్ల నిలు వేగంగా ఎంఎస్ఎంఈలు కోలుకుంటున్నాయి.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. మూలధన పెట్టుబడులు పుంజుకుంటాయి.
* పీఎం కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయి.
* దేశీయంగా వినియోగం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అయితే, మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి.
* సీఏడీని ఎదుర్కోవడానికి, రూపాయి అస్థిరతను నిలువరించడానికి మన వద్ద చాలినని విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి.
మన దేశంపై ప్రపంచ దేశాల ఆశావాదాన్ని, మౌలికరంగంపై దృష్టి, వ్యవసాయరంగంలో ప్రగతి, పరిశ్రమలు, భవిష్యత్తు రంగాలు వంటి వాటితో సహా భారత వృద్ధి పథాన్ని 2022-23 ఆర్థిక సర్వే సమగ్రంగా విశ్లేషించింది.
ప్రధాని నరేంద్ర మోదీ
ఆర్థిక సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు
* ప్రపంచ వృద్ధిలో మందగమనం అంతర్జాతీయ కమోడిటీల ధరలను కిందకు తెస్తుంది. ఈ కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ సీఏడీ పరిస్థితి మెరుగు పడుతుంది.
* 2014 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 28.6 శాతం నుంచి 40.6 శాతానికి చేరింది.
* భారత వ్యవసాయ రంగం అద్భుత పనితీరు కనబరచింది. అయితే వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న పెట్టుబడులు వంటి సమస్యల నేపథ్యంలో ఈ రంగానికి కొత్త దిశానిర్దేశం అవసరం.
* దేశవ్యాప్తంగా మధ్యలోనే బడి మానేసే పిల్లల రేటులో క్రమం తప్పకుండా తగ్గుదల చోటు చేసుకుంటోంది. మరోపక్క పాఠశాల, ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి.
* దేశ ఆర్థిక ప్రగతిలో సామాజిక రంగ మౌలిక సదుపాయాలు అభివృద్ధి మరింత కీలకం.
* 2015 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన జన్ధన్-ఆధార్-మొబైల్ అంకురం కొవిడ్-19 టీకా కార్యక్రమానికి డిజిటల్ మౌలికసదుపాయమైన కొవిన్ రూపకల్పనలో ఉపకరించింది.
* పీఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ పాలసీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు తయారీ రంగ ఉత్పత్తికి ఊతమిస్తాయి.
* సాధారణ పరిస్థితులు నెలకొంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 జీడీపీ నమోదుకు అవకాశం ఉంది.
* ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత్ చాలా వేగంగా కోలుకుంది. దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేయనున్నాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM