Income tax: ఐటీ కొత్త విధానంలో.. కొంత ఊరట
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు.
రూ.7 లక్షల వరకు ఆదాయపన్ను పడదు
తగ్గిన శ్లాబుల సంఖ్యతో ఉపశమనం
పాత పన్నుల విధానంలో మార్పులేదు
ఈనాడు, బిజినెస్బ్యూరో: కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కొత్త విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటును ప్రతిపాదించారు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకుమించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. దీంతోపాటు కొత్త పన్ను విధానం శ్లాబుల సంఖ్యనూ తగ్గించి, ఊరట కల్పించారు. మధ్య తరగతి వేతన జీవులకు ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమే. పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు. కొత్త పన్ను విధానంలో ఇప్పటి వరకు ఉన్న రూ.2,50,000 మినహాయింపును రూ.3 లక్షలకు పెంచారు. ఫలితంగా ఆదాయపు పన్ను పరిమితి రూ.50 వేలు పెరిగినట్లయ్యింది. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితిని మాత్రం రూ.2,50,000 గానే ఉంచారు. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు. చెల్లించాల్సిన పన్ను రూ.12,500 కు రిబేటు లభిస్తుంది. రూ.5 లక్షలకు మించినప్పుడే శ్లాబుల వారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ప్రామాణిక తగ్గింపుతో..
పాత పన్ను విధానంలో రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపును అనుమతించేవారు. ఇక నుంచి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికీ ఈ మినహాయింపు కల్పించనున్నారు. కొత్త విధానాన్ని ఎంచుకునే వారికి అదనపు ప్రయోజనం చేకూరేలా చేశారు.
సర్ఛార్జీ తగ్గింపు
అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్యూఎఫ్)కు ఊరట కలిగించేలా సర్ఛార్జీని తగ్గించారు. ప్రస్తుతం రూ.5 కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి 37% సర్ఛార్జీ వర్తిస్తోంది. దీన్ని 25 శాతానికి తగ్గిస్తున్నారు. దీంతో రూ.2 కోట్ల ఆదాయం ఉన్న వారందరూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 25 శాతం సర్ఛార్జీ పరిధిలోకి రానున్నారు.
ఏదైనా ఒక దానిని ఎంచుకొనే వీలు
పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒకదానిని ఎంచుకునే వీలుంది. గతంలో ఏదో ఒకదానిని మనమే ఎంచుకోవాల్సి వచ్చేది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వెబ్సైట్లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్గా ఉంటుంది. పాత పన్ను విధానం కావాలనుకుంటే దీన్ని మార్చుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరం పాత పన్ను విధానం, మరో ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ, వృత్తి, వ్యాపారం ద్వారా లాభాలను ఆర్జించే వారు ఒకసారి కొత్త పన్ను విధానంలోకి మారిన తర్వాత, మళ్లీ పాత పద్ధతిలో రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు.
* ఉద్యోగులు లీవ్ ఎన్క్యాష్మెంట్ చేసుకున్నప్పుడు రూ.3లక్షల వరకే పన్ను మినహాయింపు ఉండేది. పెరిగిన వేతనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు.
బీమా ప్రీమియం రూ.5లక్షలు దాటితే...
జీవిత బీమా పాలసీల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5లక్షలకు మించి ప్రీమియం చెల్లించినప్పుడు, పన్ను పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి తీసుకునే పాలసీలకు చెల్లించే ప్రీమియం రూ.5లక్షల లోపు ఉన్నప్పుడు మాత్రమే మెచ్యూరిటీ మొత్తానికి పన్ను పరిధి నుంచి మినహాయింపు లభిస్తుంది. రూ.5 లక్షల పైన ప్రీమియం చెల్లించిన బీమా పాలసీల ద్వారా వచ్చిన ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తించదు. పాలసీదారుడు మరణించిన సందర్భంలో వచ్చే పరిహారాలకు ఎలాంటి పన్ను ఉండదు.
వివాదాలను పరిష్కరించేలా..
ఆదాయపు పన్ను విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్-2 పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
మహిళలకు ప్రత్యేకంగా...
పొదుపు, పెట్టుబడుల దిశగా మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ బచత్ పత్ర’ పేరుతో అందిస్తున్న ఈ ఒకసారి పెట్టుబడి పథకంలో రూ.2లక్షల వరకు జమ చేసుకోవచ్చు. బాలికల పేరుమీదా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ పత్రాల్లో వార్షిక వడ్డీ 7.5 శాతం చెల్లించనున్నారు. వ్యవధి లోపు పాక్షికంగా కొంత మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతిస్తారు.
ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ తగ్గింపు
భవిష్యనిధి నిల్వలను పాన్కార్డు అనుసంధానం లేకుండా పూర్తిగా వెనక్కు తీసుకుంటే, ఆ మొత్తంపై ఆదాయపన్ను భారాన్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుత 30శాతం టీడీఎస్ను 20 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో తెలిపింది.
చిన్న మొత్తాల పరిమితి పెంపు
* పదవీ విరమణ చేసిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం అందించేందుకు ఉద్దేశించిన పెద్దల పొదుపు పథకం (సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం) పరిధిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.15 లక్షలు ఉండగా, దీన్ని రూ.30లక్షలకు పెంచారు. ప్రభుత్వ హామీ ఉండే ఈ పథకానికి ఎంతో ఆదరణ ఉంది. ప్రస్తుతం దీనికి 8% వార్షిక వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. 55 ఏళ్ల తరవాత పదవీ విరమణ చేసిన వారు, 60 ఏళ్లు దాటిన వ్యక్తులు ఇందులో చేరొచ్చు.
* పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం (మంత్లీ ఇన్కం అకౌంట్ స్కీం) పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9లక్షలకు పెంచారు. ఉమ్మడి ఖాతా పరిమితిని రూ.9లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.ప్రస్తుతం ఈ ఖాతాలో 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.