Budget 2023: విద్యాభివృద్ధిరస్తు!
కేంద్ర బడ్జెట్లో మునుపెన్నడూ లేనంతగా ఈసారి విద్యారంగానికి కేటాయింపులు చేశారు. రూ.1,12,899 కోట్లు కేటాయించారు.
దిల్లీ: కేంద్ర బడ్జెట్లో మునుపెన్నడూ లేనంతగా ఈసారి విద్యారంగానికి కేటాయింపులు చేశారు. రూ.1,12,899 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో ఇది 2.5 శాతం. పాఠశాల విద్యా విభాగానికి రూ.68,805 కోట్లు, ఉన్నత విద్యా విభాగానికి రూ.44,094 కోట్లు దక్కాయి. తాజా బడ్జెట్లో కేంద్రం విద్య, నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేసింది.
* దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల (మోడల్ స్కూళ్లు) కోసం 38,800 మంది టీచర్లు, సహాయక సిబ్బందిని నియమించనున్నారు. 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు బోధన అందించే 740 ఏకలవ్య పాఠశాలల్లో వచ్చే మూడేళ్లలో వీరిని నియమిస్తారు.
* పిల్లలు, కౌమారప్రాయుల కోసం జాతీయ డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. భౌగోళికాంశాలు, కళలు, భాషలు-సాహిత్య ప్రక్రియలు తదితర అంశాలకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తారు.
* పంచాయతీ, వార్డు స్థాయుల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తారు. ఇవి జాతీయ డిజిటల్ గ్రంథాలయ వనరులను వినియోగించుకునేందుకు వసతులను కూడా కల్పిస్తారు. పఠనాసక్తి, ఆర్థిక రంగంపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నేషనల్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్లు, పలు సంస్థలు ప్రోత్సాహాన్ని అందిస్తాయి.
* జాతీయ విద్యా మిషన్కు రూ.38,953 కోట్లు కేటాయించారు. నూతన విద్యావిధానం (ఎన్ఈపీ), 2020 అమలుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉత్తమ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు రూ.4,235.74 కోట్లు కేటాయించారు.
* 2022-23 బడ్జెట్తో పోలిస్తే యూజీసీకి 9.37%, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 17.66%, డీమ్డ్ యూనివర్సిటీలకు 27%, ఐఐటీలకు 14%, ఎన్ఐటీలకు 10.5% కేటాయింపులు పెంచారు.
* వివిధ రకాల పరిశోధనలు చేపట్టేందుకు.. అత్యాధునిక అప్లికేషన్ల అభివృద్ధికి.. సుస్థిర నగరాలు, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి.. దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో 3 కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రాలను (సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్) ఏర్పాటు చేస్తారు. ప్రముఖ పరిశ్రమలకు చెందిన వారు కూడా భాగస్వాములవుతారు.
* 5జీ సేవల అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు గాను బ్యాంకులు, వివిధ సంస్థల సహకారంతో ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో 100 ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. నూతన శ్రేణి అవకాశాలు, వాణిజ్య విధానాలు, కీలక ఉపాధి రంగాల గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పాటు అందిస్తాయి.
* వినూత్న బోధన, పాఠ్యాంశాలు; నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, ఐసీటీ అమలు వంటి అంశాల ఆధారంగా.. ఆధునిక పద్ధతుల్లో టీచర్ల శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థల ద్వారా శిక్షణలో సమూల మార్పులు చేస్తారు. వీటిని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేస్తారు.
47 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ
తాజా బడ్జెట్లో ‘యూత్ పవర్’ పేరుతో వారికి ప్రాధాన్యం కల్పించారు. యువత సాధికారత, ఉద్యోగాల సృష్టికి లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన-4.0ను అమలు చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లు ఇచ్చే శిక్షణలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐవోటీ, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్, సాఫ్ట్స్కిల్స్ వంటి కొత్త తరం కోర్సులు నిర్వహిస్తారు. యువత అంతర్జాతీయ అవకాశాలను అందుకునేలా వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ పథకం కింద మూడేళ్లలో దేశవ్యాప్తంగా 47 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల