బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీకి రూ.53,000 కోట్లు
ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్.. 4జీ, 5జీ నెట్వర్క్లను అప్గ్రేడ్ చేసేందుకు, దేశవ్యాప్తంగా ల్యాండ్లైన్ నెట్వర్క్ను పునరుద్ధరించడం కోసం రూ.53,000 కోట్లను వినియోగించనున్నామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
దిల్లీ: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్.. 4జీ, 5జీ నెట్వర్క్లను అప్గ్రేడ్ చేసేందుకు, దేశవ్యాప్తంగా ల్యాండ్లైన్ నెట్వర్క్ను పునరుద్ధరించడం కోసం రూ.53,000 కోట్లను వినియోగించనున్నామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. 2023-24 బడ్జెట్లో బీఎస్ఎన్ఎల్కు మూలధన సాయం కింద రూ.52,937 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళిక కోసం గత ఏడాది ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగానే బడ్జెట్లో తాజా కేటాయింపులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు.
కొవిడ్ ముందు పరిస్థితికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
దిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద గ్రామాల్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య కొవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంది. మహమ్మారి సంక్షోభం నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకుని, సాధారణ స్థాయికి చేరుకుందనడానికి ఇదే నిదర్శమని సర్వే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని