Budget 2023: ‘హోం’కు పెరిగిన కేటాయింపులు
అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తాజా బడ్జెట్లో రూ.1.96 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది చేసిన రూ.1,85,776.55 కోట్ల కేటాయింపుల కన్నా ఇది అధికం.
అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
ప్రధాని భద్రతా విభాగానికి రూ.433.59 కోట్లు
దిల్లీ: అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తాజా బడ్జెట్లో రూ.1.96 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది చేసిన రూ.1,85,776.55 కోట్ల కేటాయింపుల కన్నా ఇది అధికం. హోంశాఖకు తాజాగా చేసిన కేటాయింపుల్లో సింహ భాగాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, నిఘా సేకరణ యంత్రాంగానికి కేంద్రం ప్రత్యేకించింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి రోడ్లు వంటి సౌకర్యాలకు, పోలీసు మౌలిక వసతుల మెరుగుకు, పోలీసు దళాల ఆధునికీకరణకు గణనీయ స్థాయిలో కేటాయింపులు జరిగాయి.
* తాజా బడ్జెట్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు రూ.1,27,756.74 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.1,19,070.36 కోట్లుగా ఉన్నాయి.
* అంతర్గత భద్రత విధుల్లో నిమగ్నమయ్యే సీఆర్పీఎఫ్కు రూ.31,772.23 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్లో ఈ దళానికి రూ.31,495.88 కోట్లు కేటాయించారు.
* పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెంబడి ఉన్న సరిహద్దులను రక్షించే బీఎస్ఎఫ్కు గత ఏడాది రూ.23,557.51 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.24,771.28 కోట్లు ప్రతిపాదించారు.
* అణు కేంద్రాలు, విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాల భద్రతను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాని (సీఐఎస్ఎఫ్)కి గత బడ్జెట్లో రూ.12,293.23 కోట్లను ఇవ్వగా, తాజాగా 13,214.68 కోట్లు కేటాయించారు.
* నేపాల్, భూటాన్ సరిహద్దులను రక్షించే సశస్త్ర సీమా బల్కు గత ఏడాది రూ.8,019.78 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.8,329.10 కోట్లు ప్రతిపాదించారు.
* భారత్-చైనా సరిహద్దు భద్రత బాధ్యతలను చేపట్టే ఐటీబీపీకి గత బడ్జెట్లో రూ.7,626.38 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.8,096.89 కోట్లు ప్రత్యేకించారు.
* భారత్-మయన్మార్ సరిహద్దుల్లో, ఈశాన్య ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న అస్సాం రైఫిల్స్కు గత బడ్జెట్లో రూ.6,561.33 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.7,052.46 కోట్లు కేటాయించారు.
* అత్యవసర భద్రతా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)కి రూ.1,286.54 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ దళానికి రూ.1,183.80 కోట్లు ప్రత్యేకించారు.
* ఇంటెలిజెన్స్ బ్యూరోకు రూ.3,418.32 కోట్లు, దిల్లీ పోలీసు విభాగానికి రూ.11,662.03 కోట్లు కేటాయించారు.
* ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక భద్రతా దళాని(ఎస్పీజీ)కి గత ఏడాది రూ.411.88 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్లో రూ.433.59 కోట్లు ప్రత్యేకించారు.
* సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.3,545.03 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ పద్దు కింద రూ.3,738.98 కోట్లు ప్రతిపాదించారు.
* పోలీసు మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3,636.66 కోట్లను ఇచ్చారు. 2022-23 బడ్జెట్లో రూ.2,188.38 కోట్లను ప్రత్యేకించారు.
* పోలీసు దళాల ఆధునికీకరణకు రూ.3,750 కోట్లను ప్రతిపాదించారు. గత ఏడాది దీనికోసం రూ.2,432.06 కోట్లు కేటాయించారు.
* భద్రత సంబంధ వ్యయం కోసం రూ.2780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణ పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రతా పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్ సంస్థల ఆధునికీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దు చెక్పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు కేటాయించారు.
సీబీఐకి స్వల్ప పెరుగుదల
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాజా బడ్జెట్లో రూ.946 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే ఇది 4.4 శాతం అధికం. 2022-23 బడ్జెట్ అంచనాల్లో ఈ విభాగానికి రూ.841.96 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో అది రూ.906.59 కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్లో సీబీఐ శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ తోడ్పాటు విభాగాలకు నిధులు ప్రత్యేకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!