అంత్యక్రియలకు ముందు కళ్లు తెరిచిన 109 ఏళ్ల బామ్మ
మరణించిందనుకున్న 109 ఏళ్ల బామ్మ 7 గంటల తర్వాత లేచి కూర్చోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
మరణించిందనుకున్న 109 ఏళ్ల బామ్మ 7 గంటల తర్వాత లేచి కూర్చోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నర్సన్ ఖుర్ద్ గ్రామానికి చెందిన జ్ఞాన్ దేవి అనే వృద్ధురాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రిలో చేర్పించగా ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్మశానవాటికకు తీసుకెళ్లే కొన్ని నిమిషాల ముందు వృద్ధురాలి శరీరంలో చలనం కనిపించడంతో వారు ఆమెను కదిలించారు. ఇంతలో ఆమె కళ్లు తెరిచి లేచి కూర్చుంది. బామ్మను ఏమైనా తింటావా అని అడగగా, తనకు చాట్ తినాలనుందని చెప్పింది. వెంటనే వారు చాట్ తీసుకొచ్చి బామ్మ కోరికను తీర్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్
-
Ts-top-news News
MLC kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ
-
Ap-top-news News
Vijayawada: విజయవాడ- శిర్డీ విమాన సర్వీసు ప్రారంభం
-
Movies News
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’గా రామ్చరణ్.. అదరగొట్టేలా టైటిల్ లోగో
-
Ap-top-news News
Scrub Typhus : మచ్చలే కదా అని తీసిపారేయొద్దు.. తీవ్ర తలనొప్పీ ఓ సంకేతమే
-
Politics News
Nakka Anand Babu: సజ్జలను విచారించాలి.. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు